కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న తరుణంలో దానిని కట్టడి చేసేుందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అత్యవసర సర్వీసులు మినహా అన్ని సేవలు మూతపడ్డాయి. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఇక్కడి ప్రజలు అకలితో అలమటించకుండా పలు మినహాయింపులు ఇచ్చారు. అయితే పలు రాష్ట్రాల్లో మాత్రం లాక్ డౌన్ ఏకంగా కర్ప్యూను తలపిస్తోంది. తాజాగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ పలు దుకాణాలు తెరిచేందుకు మినహాయింపులు కల్పించింది.
కొన్ని షరతులపై స్థానిక దుకాణాలను తెరిచేందుకు అనుమతిస్తూ నిన్న అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.హోం శాఖ ఆదేశాల ప్రకారం... ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ‘షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ల్’ పరిధిలోకి వచ్చే రిజిస్ట్రేషన్ కలిగిన అన్ని దుకాణాలను ఇకపై తెరవవచ్చు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోకి వచ్చే నివాస సముదాయాలు, ప్రాంతాల్లోని అన్ని దుకాణాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు హోంశాఖ ఆదేశాలు జారీచేసింది.
ఇక సింగిల్ బ్రాండ్ లేదా వివిధ బ్రాండ్ల వస్తువులను విక్రయించే మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లలో ఉండే దుకాణాలు తెరిచేందుకు మాత్రం అనుమతి లేదని ఆ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈ సడలింపులు హాట్ స్పాట్లు, రెడ్ జోన్లు, కంటైన్మెంట్ ప్రాంతాలకు వర్తించవు. ఇక్కడ గతంలో విధించిన నిషేధాజ్ఞలు యథాతథంగా కొనసాగుతాయి. ఇక దుకాణదారులు 50 శాతం సిబ్బందిని మాత్రమే వినియోగించాలని, పనిసమయంలో మాస్కులు ధరించటం, సామాజిక దూరం పాటించటం తదితర జాగ్రత్తలు తప్పనిసరి అని కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే దిల్లీలో ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more