Coronavirus positive cases tally reaches 1000 Mark in AP ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తున్న కరోనావైరస్.. 24 గంటల్లో 61 కేసులు

Coronavirus positive cases tally reaches 1000 mark in andhra pradesh

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

Andhra Pradesh reported 61 new Coronavirus positive cases, with this, the number of positive cases as of positive cases as of Saturday morning crosses 1000 Mark and two deaths recorded in state taking the toll to 31. In all, 171 persons completed treatment and were discharged from hospitals.

ఆంధ్రప్రదేశ్ లో విజృంభిస్తున్న కరోనావైరస్.. 24 గంటల్లో 61 కేసులు

Posted: 04/25/2020 01:41 PM IST
Coronavirus positive cases tally reaches 1000 mark in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతొంది. పోరుగునున్న తెలుగు రాష్ట్రంలో వందకు మించిన సంఖ్యలో కేసులు నమోదైన నేపథ్యంలోనూ ఇక్కడ మాత్రం పదుల సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. కాగా ఇవాళ్టి రోజున తెలంగాణలో కేసులు కాసింత నెమ్మదిస్తుండగా, ఏపీలో మాత్రం కలవరానికి గురిచేస్తోంది. ఇన్నిరోజులు గ్రీన్ జోన్ జిల్లాగా వున్న శ్రీకాకుళం జిల్లాలోనూ కరోనా కాటు వేసింది. కరోనా వేగంగా విస్తరిస్తున్న ఈ నేపథ్యంలో మహమ్మారిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరన్ని చర్యలకు పూనుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ లింకు బయటపడిన తరువాత వారం పది రోజుల పాటు కరోనా వైరస్ రాష్ట్రంలో పెద్దగా వ్యాప్తించలేదు. అయితే తాజాగా మాత్రం రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు వ్యాప్తి పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఏకంగా వెయ్యి మార్కును దాటడం రాష్ట్ర ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా నిన్న ఉదయం నుంచి ఇవాళ్టి ఉదయం వరకు రాష్ట్రంలో కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లాలోనూ ఒకే సారి మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అందోళన కలిగిస్తోంది.

క్రితం రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఇవాళ ఉదయం పదకొండు గంటల వరకు కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 1016కి చేరింది. ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో నిన్నటి వరకు 29 మంది మరణించగా, తాజాగా మరో ఇధ్దరు ఈ మహమ్మారి బారిన పడి అసువులు బాసారు. దీంతో ఇవాళ్టి ఉదయం వరకు మరణించిన వారి సంఖ్య ఏకంగా 31కి చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 171 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు.

ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణాలో 25, కర్నూలులో 14, గుంటూరు జిల్లాలో 3 కేసులు, అనంతపురంలో 5 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 3కేసులు, శ్రీకాకుళంలో మూడు. కడపలో నాలుగు, నెల్లూరులో నాలుగు కేసు  నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1016కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 814మంది చికిత్స పొందుతున్నారు. కంటైన్మెంట్‌ జోన్లు, రెడ్‌ జోన్లలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఇదివరకే ప్రభుత్వం అదేశాలను జారీ చేసింది.

జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి,. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 275 కేసులు నమోదు కాగా, తాజాగా మరో మరణంతో మొత్తంగా 9 మరణాలు సంభవించాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాల్లో 209 కేసులు, ఎనమిది మరణాలు సంభవించాయి. నెల్లూరు-72 కేసులు రెండు మరణాలు, కృష్ణా-127 కేసులు, మరో మరణంతో మొత్తంగా ఎనమిది మరణాలు నమోదయ్యాయి, ప్రకాశం - 53, పశ్చిమగోదావరి-39, చిత్తూరు-73,  విశాఖపట్నం-22, కడప జిల్లాలో 55 కేసులు, అనంతపురం-51 కేసులు నాలుగు మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లాలో 34 కేసులు, ఇక తాజాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా మూడు కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం జిలాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles