తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లి నెమ్మదించింది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, పోలీసులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది అహర్నిశలు శ్రమించి చేస్తున్న కృషి ఎట్టకేలకు ఫలితానిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కేవలం 17 కరోనా కేసులు మాత్రమే పిర్యాదు కావడంతో అధకిారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖ పడుతాయని రాష్ట్ర అరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఇదివరకు ఆశాభావం వ్యక్తం చేసినట్టే కేసులు కూడా తగ్గుముఖం పట్టడంతో తెలంగాణవాసుల్లోనూ హర్షం వ్యక్తం అవుతోంది.
ఇక తాజా పెరుగుదలతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 945కు చేరింది. కాగా, తెలంగాణలో నమోదైన కరోనా కేసుల్లో అత్యదికం రాజధాని హైదరాబాద్ లోనే కావడం గమనార్హం. దీంతో కావడం గ్రేటర్ హైదరాబాద్ వాసులు కూడా తీవ్ర అందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో 175 మంది చిన్నారులపై తన ప్రభావాన్ని చాటుతున్న మమమ్మారి ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తన కంబంధహస్తాలలోకి ఎక్కువ మందిని వ్యాపించేలా చేస్తోంది. 345కి పైగా కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదు అయ్యాయి. మొత్తం 194 మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణలో హైదరాబాద్ తరువాత సూర్యాపేట, నిజామాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో అత్యధిక కోవిడ్ కేసులను నమోదు చేసుకున్నాయి. ఇవాళ కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 10, సూర్యాపేట జిల్లాలో 3, గద్వాల జిల్లాలో 2 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ బుటెటిన్లో ప్రకటించింది. ఇవాళ ఒక్కరు మృతి చెందడంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 24కి చేరిందని ఆరోగ్య శాఖ వివరించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 945కి చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 194 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా..725 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more