Coronavirus cases in India reaches 21K mark దేశంలో 21 వేల మార్కు దాటిన కరోనా కేసులు

Coronavirus in india covid 19 cases in india reaches 21 000 mark death toll at 681

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

The total number of coronavirus cases in India today reaches over 21,000 mark after 2409 new infections were reported in past 24 hours, according to the latest data from Health Ministry. The death toll has gone up to 681 while 4258 have recovered, showed the latest data.

దేశంలో 681కు చేరిన కరోనా మరణాలు.. 21 వేల మార్క్ చేరిన కేసులు

Posted: 04/23/2020 10:59 AM IST
Coronavirus in india covid 19 cases in india reaches 21 000 mark death toll at 681

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దాని ప్రభావం దాటికి కొలుకునేవారి సంఖ్య భారీగానే వున్నా అసువులు బాస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరగడం అందోళనకలిగిస్తోంది. దేశంలో ఈ వైరస్ మహమ్మారి వ్యాప్తిన కట్టిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటికీ ప్రజలు అకడక్కడా ఉల్లంఘనలకు పాల్పడటంతో అటు వ్యాప్తి, ఇటు మరణాలు సంభవిస్తూనే వున్నాయి. దీంతో దేశప్రజల్లో కలవరం అంతకంతకూ పెరుగుతూనే వుంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా రెండు వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 41 మంది మరణించారని పేర్కొంది.

దీంతో ఇవాళ ఉదయానికి దేశంలో నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 681కు చేరింది. కరోనా కేసుల సంఖ్య సుమారుగా 21 వేల మార్కుకు చేరిందని వెల్లడించింది. ఇవాళ్టి వుదయానికి 21 వేల మంది ఈ మహమ్మారి ప్రభావానికి గురయ్యారు. ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 4258 మంది కోలుకున్నారని చెప్పారు. ప్రతి 24 శాంపిళ్లలో 1 కరోనా పాజిటివ్‌ కేసు నమోదవుతోందని తెలిపిన అధికారులు.. దేశవ్యాప్తంగా కరోనా బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్యకూడా అధికంగానే వుందని తెలిపింది. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది.

దీంతో దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 21.393కి చేరకుంది. గడిచిన 24 గంటల వ్యవధితో దేశవ్యాప్తంగా రెండు వేల నాలుగు వందల తొమ్మిద మందికి వైరస్ కొత్తగా సోకింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ వైరస్ సోకి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 681 మంది మరణించారని కూడా తెలిపింది. మొత్తం బాధితుల్లో 4258 మంది వ్యాది నుంచి కోలుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి శాతం 19.36గా నమోదైయ్యిందని, ప్రభుత్వం తెలిపింది.

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతరం అవుతొంది. రాష్ట్రంలో కొవిడ్‌ సోకి ఇప్పటి వరకూ 251మంది మృత్యువాతపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 5218 చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఇక గుజరాత్లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక్కడ ఈ వైరస్‌ బారినపడి 90మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 2178కి చేరింది. మధ్యప్రదేశ్‌లోనూ కరోనాతో మరణించే వారిసంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఈ వైరస్‌కు 76మంది బలయ్యారు. దిల్లీలోనూ కరోనా వైరస్‌తో ఇప్పటివరకు 47మంది మరణించారు. కేసుల సంఖ్య 2156కు చేరింది. దేశంలో ఏడురాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేయి దాటింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles