మానవాళి మనుగడకు సవాల్ విసురుతూ వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం భూమిపై చాలా కాలం పాటే వుంటుందని ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కోవిడ-19 ను తేలిగ్గా తీసుకోకూడదని, కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించవద్దని సూచనలు చేసింది. కొన్ని దేశాలు ఈ వైరస్ అదుపులోకి వచ్చిందని భావిస్తున్నప్పటికీ.. కొత్తగా మళ్ళీ పుంజుకోవడం చూస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనామ్ వెల్లడించారు. ‘తప్పు చేయొద్దు, ఈ వైరస్ సుదీర్ఘకాలం మనతోనే ఉంటుందని’ ప్రపంచ దేశాలను హెచ్చరించారు.
చాలా దేశాలు లాక్డౌన్ ను సడలించాలని అనుకుంటున్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి అప్రమత్తం చేసింది. అయితే, మహమ్మారిని ఎదుర్కోవడంలో చాలా దేశాలు ఇప్పటికీ ప్రాథమిక దశలోనే ఉన్నాయని, రానున్న కాలంలో ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ప్రస్తుతం పశ్చిమ యూరోప్ దేశాల్లో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ.. ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికాతో పాటు తూర్పు యూరోప్ దేశాల్లో ఈ వైరస్ తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. మొదట్లో కరోనా బారినపడ్డ దేశాల్లో వైరస్ తీవ్రత తగ్గిందని భావిస్తున్నప్పటికీ మళ్లీ పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం గమనించాలన్నారు.
కరోనా తీవ్రతను ఆదిలోనే పసిగట్టి సరైన సమయంలోనే (జనవరి 30వ తేదీనే) అంతర్జాతీయ ఎమర్జన్సీ ప్రకటించిందని వెల్లడించారు. దీంతో అన్ని దేశాలకు సన్నద్ధమయ్యేందుకు చాలా సమయం ఉందనే విషయాన్ని నొక్కిచెప్పారు. ఈ విషయంలో డబ్ల్యూహెచ్ఓ సరైన సమయంలో స్పందించిందని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. కరోనా వైరస్ ను నియంత్రించే క్రమంలో సరిగా వ్యవహరించని కారణంగా డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ పదవికి రాజీనామా చేయాలని అమెరికా చేసిన వ్యాఖ్యలను టెడ్రోస్ తిరస్కరించారు. డబ్ల్యూహెచ్ఓకు నిధుల నిలిపివేతపై నిర్ణయాన్ని అమెరికా పునఃపరిశీలిస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 26లక్షల మంది ఈ వైరస్ బారిన పడగా లక్షా 80వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more