కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మానవజాతి మనుగడకే సవాల్ విసురుతూ లక్షలాధి మంది ప్రాణాలను హరించివేస్తున్న తరుణంలో అందుకు తగిన స్థాయిలో చర్యలు తీసుకుని లాక్ డౌన్ కట్టదిట్టంగా అమలు జరగేలా చూడాల్సిన సమయంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇంతటి అపత్కాల సమయంలో చిల్లర రాజకీయాలు మానేసి ప్రజలకు సాయం చేయాలని హితబోధ చేశారు.. లేకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా నివారణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనా కొందరు అధికార పార్టీ పెద్దలు దృష్టి పెట్టినట్లు గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలుపుతున్నాయని అన్నారు. ప్రపంచాన్ని క్రమక్రమంగా ఆక్రమిస్తున్న కరోనా కారణంగా అగ్రరాజ్యాలుగా పేరుపొందిన దేశాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి అన్నారు జనసేనాని. ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోందని.. అన్ని వసతులూ ఉన్న అగ్రరాజ్య ఆస్పత్రులు రోగులందరికీ సేవలు అందించలేక నానా అవస్థలు పడుతున్నాయన్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మందులను పంపమని భారతదేశాన్ని ప్రాధేయపడుతున్నాయి అన్నారు.
ఈ పరిణామాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అందరిపై ప్రభావం చూపేవని.. ఇక దేశంలో లక్షలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయి, ఊరుకాని ఊరిలో ఉంటూ అర్జాకలితో అలమటిస్తున్నారన్నారు. రైతులు తమ పంటను అమ్ముకునే దారి లేక పెంటకుప్పల్లో పోస్తున్నారన్నారు పవన్. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ను సైతం విడిచిపెట్టలేదని.. కేసులు పెరుగుతున్న తీరు చూస్తే ఈ మహమ్మారి ఎప్పటికి శాంతిస్తుందో ఊహకు అందడం లేదని.. గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల ప్రజలు పెరుగుతున్న పాజిటివ్ కేసులు చూసి బెంబెలెత్తిపోతున్నారన్నారు.
ప్రపంచం అంతా ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో తప్పులు వేలెత్తి చూపేవారిపై బురదచల్లే కార్యక్రమాన్ని అధికార పార్టీ పెద్దలు కొనసాగిస్తున్నారన్నారు. అత్యవసర వైద్య సేవలు అందించవలసిన తరుణంలో రాజకీయాలను భుజాలకు ఎత్తుకున్నారని పవన్ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయని.. ఆయనపై జరుగుతున్న వ్యక్తిత్వహనన దాడి ప్రజాస్వామ్యవాదులు ఖండిచాలన్నారు జనసేనాని.
కన్నా లక్ష్మీనారాయణకు క్షమాపణలు చెప్పాలని అడిగే స్థాయిలో ఉందన్నారు. ఈ ఆపత్కాల సమయంలో జనసేన పార్టీ అందరినీ కోరుతున్నది ఒక్కటే.. కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయేంత వరకూ రాజకీయాలను పక్కన పెడదామన్నారు. చిల్లర రాజకీయాలకు దూరంగా ఉందాం.. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులు తీర్చడంపై మన శక్తియుక్తుల్ని కేంద్రీకరిద్దామని పిలుపునిచ్చారు. ఈ సమయంలోనైనా రాజకీయాలు ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more