75 new Covid-19 cases reported in AP ఏపీలో పెరిగిన కరోనా విజృంభన.. 24 గంటల్లో 56 కేసులు

Coronavirus positive cases tally reaches 813 in andhra pradesh

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

Andhra Pradesh reported 56 new Coronavirus positive cases, with this, the number of positive cases as of positive cases as of Wedday morning stand at 813 and deaths recorded in state at Twenty Four. In all, 120 persons completed treatment and were discharged from hospitals.

ఏపీలో పెరిగిన కరోనా విజృంభన.. 24 గంటల్లో 56 కేసులు

Posted: 04/22/2020 02:48 PM IST
Coronavirus positive cases tally reaches 813 in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి అంతకంతకూ పెరుగుతున్నాయి. కాసింత నెమ్మదించిందని బావిస్తున్న తరుణంలో మళ్లీ ఈ మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ లింకుతో ముడిపడిన వారితో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. తాజాగా నిన్న ఉదయం నుంచి ఇవాళ్టి ఉదయం వరకు రాష్ట్రంలో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 813 కి చేరుకుంది.

క్రితం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఇవాళ ఉదయం తొమ్మిద గంటల వరకు కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య813కి చేరింది. ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూ వుండలం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో ఇవాళ్టి ఉదయం వరకు మరణించిన వారి సంఖ్య ఏకంగా 24కు చేరుకుంది. ఇక ఇప్పటి వరకు కరోనావైరస్ బారిన పడినవారిలో మొత్తంగా 120 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్ అయ్యారు.

ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 19 కేసులు, చిత్తూరులో ఆరు కేసులు, కడపలో ఐదు కేసులు కృష్ణలో మూడు, ప్రకాశంలో జిల్లాలో నాలుగు కేసులు  నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 813కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 669 మంది చికిత్స పొందుతున్నారు. కంటైన్మెంట్‌ జోన్లు, రెడ్‌ జోన్లలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఇదివరకే ప్రభుత్వం అదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య కూడా 24కు చేరింది.

జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల వివరాలు ఇలా వున్నాయి,. గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా 177 కేసులు నమోదు కాగా, ఈ వైరస్ బారిన పడి ఈ జిల్లాలో ెనమిది మృతిచెందారు. ఆంతకన్నా అత్యధికంగా కర్నూలు జిల్లాలో 203 కేసులు నమోదు కాగా ఐదుగురు మృతిచెందారు. నెల్లూరు-67 కేసులు రెండు మరణాలు, కృష్ణా-860 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయి, ప్రకాశం - 48, పశ్చిమగోదావరి-39, చిత్తూరు-59,  విశాఖపట్నం-21, అనంతపురం-36 కేసులు మూడు మరణాలు సంభవించాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యల్పంగా -26 కేసులు నమోదయ్యాయి, ఇక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles