దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1533 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా 36 మంది మరణించారని పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కకరోనా మృతుల సంఖ్య 543కు చేరింది. కరోనా కేసుల సంఖ్య 17.265కి చేరిందని వెల్లడించింది. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 2546 మంది కోలుకున్నారని చెప్పారు. ప్రతి 24 శాంపిళ్లలో 1 కరోనా పాజిటివ్ కేసు నమోదవుతోందని తెలిపింది.
లాక్ డౌన్ కు ముందు దేశంలో కేసుల సంఖ్య రెట్టింపు అవ్వడానికి కేవలం మూడు రోజులు మాత్రమే పట్టేదని విశ్లేషించిన వైద్య అరోగ్యశాఖ తాజాగా లాక్ డౌన్ నేపథ్యంలో ఆ సంఖ్య రెట్టింపు అవ్వడానికి ఆరు రోజులు కన్నా ఎక్కువ సమయం పడుతుందని తెలిపింది. ఈ విషయం లాక్ డౌన్ కాలంలో గత 7 రోజుల డేటాను పరిశీలించి మీదటే తాము స్పష్టం చేస్తున్నట్లు పేర్కొంది. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసుల రెట్టింపు సరాసరి జాతీయ సగటు కంటే తక్కువగా ఉందన్నారు. ఇప్పటి వరకు 5 లక్షల యాంటీబాడీ టెస్ట్ కిట్లను రాష్ట్రాలకు అందజేసినట్లు వివరించింది.
ఇక అత్యధిక కేసులు ఉన్న మహారాష్ట్రలో వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అక్కడ ఇప్పటి వరకు 4,203 కేసులు నమోదయ్యాయి. వీరిలో 507 మంది కోలుకోగా.. మరో 223 మంది మృతిచెందారు. ఇక దిల్లీలో 2,003 కేసుల్ని నిర్థారించారు. 72 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 45 మంది ప్రాణాలొదిలారు. ఇటు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 858 కేసులు నిర్ధారణ కాగా, 21 మంది మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య 647కు పెరిగింది. 18 మంది మరణించారు.
ఇక ప్రస్తుతం అమలులో ఉన్న లాక్డౌన్ నుంచి నాన్కంటైన్మెంట్ జోన్లకు ఆంక్షల నుంచి స్వల్ప మినహాయింపులు ఇవ్వనున్న విషయం తెలిసిందే. అయితే, వైరస్ వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ, దిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇక దేశవ్యాప్తంగా కొత్తగా 36 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 543కు చేరింది. ఇప్పటి వరకు 2,546 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకొని ఇళ్లకు చేరారు. మరో 14,175 మంది ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more