కరోనా వ్యాప్తి వల్ల ఏర్పడుతున్న పరిస్థితుల వల్ల భారత్లో కూలి పనులు, చిరు వ్యాపారాలు వంటి అనధికారిక ఆర్థిక రంగంలో పని చేస్తున్న దాదాపు 40 కోట్ల మంది (400 మిలియన్లు) కటిక పేదరికంలోకి జారుకునే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమతి కార్మిక సంస్థ హెచ్చరించింది. కరోనా వైరస్ ఇప్పటికే భారత్ సహా ప్రపంచంలోని అన్ని దేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 195 మిలియన్ ఉద్యోగాలు పోనున్నాయని ఓ నివేదికలో తెలిపింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తలెత్తుతున్న అత్యంత సంక్షోభ ఆర్థిక పరిస్థితులను కరోనా వల్ల చూడబోతున్నట్లు చెప్పింది. 'భారత్, నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక సంఖ్యలో అనధికార, అసంఘటిత రంగంలోని కార్మికులపై ఈ ప్రభావం పడుతుంది. భారత్లో 90 శాతం మంది ప్రజలు అనధికార ఆర్థిక రంగంలోనే పనిచేస్తున్నారు. వారంతా కటిక పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశముంది. భారత్లో లాక్డౌన్ కారణంగా కార్మికులపై ఈ ప్రభావం పడుతుంది. కరోనా తిరిగి వారిని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేలా చేస్తోంది' అని నివేదికలో తెలిపింది.
'అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో కార్మికులు, వ్యాపారాలు తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. శరవేగంగా, నిర్ణయాత్మకంగా, అందరూ కలిసి చర్యలు తీసుకోవాల్సి ఉంది. సరైన, వేగవంతమైన చర్యల వల్ల లాభం ఉంటుంది. కరోనా తెస్తున్న సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6.7 పని గంటలను ప్రపంచం కార్మికుల నుంచి కోల్పోతుంది' అని తెలిపింది. 'ఉన్నత, మధ్యస్త ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాలు ఆర్థిక పరంగా 2008-09 ఆర్థిక సంక్షోభంలో వచ్చిన నష్టం కన్నా అత్యధికంగా నష్టపోనున్నాయి' అని చెప్పింది.
ప్రపంచంలో నిరుద్యోగం ఎంతగా పెరుగుతుందన్న అంశం భవిష్యత్తులో దేశాలు తీసుకునే విధానపర చర్యల మీద ఆధారపడి ఉంటుందని తెలిపింది. ప్రపంచంలో 1.25 బిలియన్ల మంది కార్మికులు, ఉద్యోగులు హైరిస్క్లో ఉన్నారని, వారిని సంస్థలు తొలగించే అవకాశం లేక వేతనాల్లో కోత విధించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. తక్కువ వేతనం వచ్చే ఉద్యోగాలు, పనికి తక్కువ నైపుణ్యాలు అవసరం ఉన్న ఉద్యోగాలను ఒక్కసారిగా కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more