దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న కరోనా వైరస్ బారిన అనేక మంది పడ్డారు. దేశంలోనూ వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ 24 గంటల వ్యవధిలో మరో 500 మందికి పైగా ప్రజలను తన బారిన పడేసింది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6412కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 199మంది మరణించగా 5709మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 504మంది కొవిడ్-19 నుంచి కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా గత 24గంటల్లో కొత్తగా 33మరణాలతోపాటు పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి. రానున్నరోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24గంటల్లో ఇక్కడ 25మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 97కి చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1364గా ఉంది. ఆంధ్రప్రదేశ్లో గత 24గంటల్లో 15కొత్త కేసులు నమోదుకాగా తెలంగాణలో 18కేసులు నిర్ధారణ అయినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్లలో కరోనా తీవ్రత కాస్త తక్కువగానే ఉంది.
అత్యధిక కేసులు నమోదైన మహారాష్ట్రాలో తాజాగా ఈ సంఖ్య 1364 చేరగా, ఇప్పటివరకు 97 మరణాలు సంభవించాయి. ఆ తరువాత తమిళనాడులో 834 కేసులు నమోదయ్యారి. ఆ తరువాత ఢిల్లీలో 729 కేసులు, రాజస్థాన్ 463 కేసులు, తరువాత తెలంగాణలో 471 కేసులు, ఉత్తర్ ప్రదేశ్ 410, ఏపీలో 363, కేరళలో 357, మధ్యప్రదేశ్ లో 259, గుజరాత్ 241, కర్ఱాటక 181, హర్యానా 169, జమ్మూకశ్మీర్ లో 158, పశ్చిమ బెంగాల్ 116, పంజాబ్ లో 101 కేసులు నమోదయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more