యవత్ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. వేలాది మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ మహమ్మారి మన దేశంలోనూ కదం తొక్కుతోంది. ప్రస్తుతం వేగాన్ని అందుకున్న ఈ మహమ్మారి గంట గంటకు తన బారిన పడుతున్న వారి సంఖ్యను పెంచుకునే పనిలోనే వుంది. మహమ్మారి ప్రభావాన్ని పసిగట్టిన కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు అదేశాలు జారీ చేసింది. దీంతో పంజా విసురుతున్నా.. దాని ప్రభావానికి వందల సంఖ్యలోనే ప్రజలు చిక్కకున్నారు.
అయితే ఇంటతి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ దేశంలో వందల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వందల సంఖ్యలోనే చికకొందరు మాతమతోంది. ప్రారంభంలో మన దేశంలో గణనీయంగా అత్యంత తక్కువ సంఖ్యలో నమోదైన కేసులు.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన తరువాత కూడా అధిక సంఖ్యలో పెరగడం తీవ్ర అందోళన రేకెత్తించే అంశం. దేశవ్యాప్తంగా ఈ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారంనాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1965కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరగడానికి నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలు ప్రధాన కారణమయ్యాయి. తబ్లిగీ జమాత్ ప్రార్థనాల్లో పాల్గొని కరీంనగర్ వచ్చిన ఇండొనేసియా బృందంలోని కొందరికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో తెలంగాణ సర్కారు కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. మత ప్రార్థనల్లో పాల్గొన్న ఆరుగురు తెలంగాణవాసుల మృతి చెందారు. ఏపీలో కరోనా కేసులకూ ఢిల్లీలోనే మూలాలున్నట్టు నిర్ధారణ కావడంతో వివిధ రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. 24 గంటల వ్యవధిలో దేశంలో 547 కేసులు నమోదు కావడం తీవ్ర అందోళనలకు దారితీస్తోంది.
దీంతో ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 2,500దాటగా.. గడచిన 24 గంటల్లోనే 540కిపైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. మొత్తం 77 మంది మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 21 ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో అత్యధికంగా 423 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ మర్కజ్ ప్రభావం తమిళనాడులో స్పష్టంగా కనబడుతోంది. ఆ రాష్ట్రంలో మూడు రోజుల్లోనే 240 వరకు కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ కేసులకు ఢిల్లీ నిజాముద్దీన్తోనే సంబంధం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే ఏపీలో 38, తెలంగాణలో 27 కేసులు నమోదయ్యాయి.
ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 77 మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 21 మంది, తెలంగాణ 9, మధ్యప్రదేశ్ 8, గుజరాత్ 7 పశ్చిమ్ బెంగాల్ 6, పంజాబ్ 5, ఢిల్లీ 4, కర్ణాటక 3, జమ్మూ అండ్ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్, కేరళలో 2, ఏపీ, బీహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. కాగా, మహారాష్ట్రలో 423, తమిళనాడులో 309, ఢిల్లీలో 293, కేరళలో 286, తెలంగాణ 154, ఆంధ్రప్రదేశ్ 149, రాజస్థాన్ 133, ఉత్తరప్రదేశ్లో 126, కర్ణాటకలో 124, మధ్యప్రదేశ్ 107, గుజరాత్ 88, జమ్మూ కశ్మీర్ 70, పశ్చిమ్ బెంగాల్ 53, హర్యానా 49, పంజాబ్ 47, బీహార్ 29, చండీగఢ్ 18, అసోం 16, లడఖ్ 13, అండమాన్ నికోబార్ దీవులు 10, ఉత్తరాఖండ్ 10, చత్తీస్గఢ్ 9, హిమాచల్ప్రదేశ్ 6, గోవా 5, ఒడిశా 5, పుదుచ్చేరి 5 కేసులు నమోదయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more