12 new covid-19 cases in AP ఏపీలో 161కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

Ap reports 12 new covid 19 cases tally rises to 161

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates,

Twelve more persons tested positive for coronavirus in Andhra Pradesh since Thursday night, taking the state's total such cases to 161. According to a Health Department bulletin at 10 am on Friday, the new cases have been reported since 10 pm on Thursday.

ఆంధ్రప్రదేశ్ లో 161కి చేరిన కరోనా కేసులు.. తొలి మరణం నమోదు

Posted: 04/03/2020 11:15 AM IST
Ap reports 12 new covid 19 cases tally rises to 161

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నాయి. దేశంలోకి ఈ మహమ్మారి ఫిబ్రవరి 1న ప్రవేశించినట్టు తొలి కరోనా కేసు నమోదు అయిన తరువాత మార్చి చివరి వారం ప్రారంభం వరకు కూడాపెద్దగా కేసులు నమోదు కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. అయితే ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ఆద్వర్యంలో నిర్వహించిన తబ్లీగీ జమాత్ ప్రార్ధనలలో పాల్గొని తిరిగివచ్చిన ముస్లింల కారణంగా కరోనా కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే పెరిగిపోయాయి.

ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరగడంతో పాటు రాష్ట్రంలో తొలి మరణం కూడా సంభవించింది. గురువారం రోజున 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇవాళ ఉదయం నుంచి మరో 12 పాజిటివ్ కేసులతో రాష్ట్రం తెలంగాణ కన్నా అధిక సంఖ్యలో కేసులను నమోదు చేసుకుంది. నిన్న రాత్రి 149గా వున్న సంఖ్య రాత్రి పది గంటల నుంచి ఇప్పటి వరకు 12 కేసులు నమోదు కావడంతో అధికార వర్గాల్లో కూడా కలవరం పెడుతుండగా, ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇదిలా ఉంటే ఆంధప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. విజయవాడలోని భవానీపురంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్ రావడం కలకలం రేపగా.. తొలి కరోనా మరణం కూడా అక్కడే సంభవించింది. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ జమాతే సభకు వెళ్లి రాగా.. ఆ వ్యక్తి తండ్రి కరోనాతో చనిపోయాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు నూజివీడు, జగ్గయ్యపేటలను రెడ్ జోన్లగా నిర్ణయించారు. ఇక, భవానీపురం, ఆటోనగర్, పాత రాజరాజేశ్వరిపేటలో పకడ్బందీగా కర్ఫ్యూ విధించారు.

సోమవారం(30 మార్చి 2020) రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో కేవలం 43 కేసులే నమోదవగా, ఆ తర్వాత మూడు రోజుల్లో అదనంగా 106 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 24 కేసులు, తర్వాత కృష్ణాలో 23, గుంటూరు జిల్లాలో 20 కేసులు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న తరుణంలో ఇలా కేసులు పెరుగుతుండటంతో కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం రెడ్ అలర్ట్  ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles