ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నాయి. దేశంలోకి ఈ మహమ్మారి ఫిబ్రవరి 1న ప్రవేశించినట్టు తొలి కరోనా కేసు నమోదు అయిన తరువాత మార్చి చివరి వారం ప్రారంభం వరకు కూడాపెద్దగా కేసులు నమోదు కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. అయితే ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ఆద్వర్యంలో నిర్వహించిన తబ్లీగీ జమాత్ ప్రార్ధనలలో పాల్గొని తిరిగివచ్చిన ముస్లింల కారణంగా కరోనా కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే పెరిగిపోయాయి.
ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరగడంతో పాటు రాష్ట్రంలో తొలి మరణం కూడా సంభవించింది. గురువారం రోజున 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇవాళ ఉదయం నుంచి మరో 12 పాజిటివ్ కేసులతో రాష్ట్రం తెలంగాణ కన్నా అధిక సంఖ్యలో కేసులను నమోదు చేసుకుంది. నిన్న రాత్రి 149గా వున్న సంఖ్య రాత్రి పది గంటల నుంచి ఇప్పటి వరకు 12 కేసులు నమోదు కావడంతో అధికార వర్గాల్లో కూడా కలవరం పెడుతుండగా, ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇదిలా ఉంటే ఆంధప్రదేశ్లో తొలి కరోనా మరణం నమోదైంది. విజయవాడలోని భవానీపురంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్ రావడం కలకలం రేపగా.. తొలి కరోనా మరణం కూడా అక్కడే సంభవించింది. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ జమాతే సభకు వెళ్లి రాగా.. ఆ వ్యక్తి తండ్రి కరోనాతో చనిపోయాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు నూజివీడు, జగ్గయ్యపేటలను రెడ్ జోన్లగా నిర్ణయించారు. ఇక, భవానీపురం, ఆటోనగర్, పాత రాజరాజేశ్వరిపేటలో పకడ్బందీగా కర్ఫ్యూ విధించారు.
సోమవారం(30 మార్చి 2020) రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో కేవలం 43 కేసులే నమోదవగా, ఆ తర్వాత మూడు రోజుల్లో అదనంగా 106 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 24 కేసులు, తర్వాత కృష్ణాలో 23, గుంటూరు జిల్లాలో 20 కేసులు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న తరుణంలో ఇలా కేసులు పెరుగుతుండటంతో కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం రెడ్ అలర్ట్ ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more