తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికీ 11 మంది రాష్ట్రవాసులను పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి.. రాష్ట్రంలో అనేక మందిని తన ప్రభావానికి గురిచేస్తోంది. ఇక్కరోజులోనే 30 పాజిటివ్ కేసులు నమోదు చేసుకున్న తరువాత అంతటి ప్రభావంతో మరోక్క రోజు వ్యవధిలో ఏకంగా 27 కేసులు నమోదయ్యాయి. నిజాముద్దీన్ మర్కజ్కు వెళ్లొచ్చిన వారికి, వారి వల్ల కుటుంబ సభ్యులకు మాత్రమే కొత్తగా వైరస్ సోకుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింద’ని వైద్య ఆరోగ్య శాఖ అధికార వర్గాలు తెలిపాయి.
దీంతో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 158కి చేరింది. తెలంగాణలో గురువారం ఒక్కరోజునే మరో 27 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో కేసుల సంఖ్య 154కి చేరింది. ఈ మొత్తం కేసుల్లో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు, వారి బంధువులే 86 మంది ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలోనే ఎక్కువ కేసులు నమోదవుతుండడంతో వారిపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇప్పటికే చాలా మందిని గుర్తించిన అధికారులు.. వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
వారితో పాటు కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ కేంద్రాలకు తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో కేసులు బయటపడుతున్నాయి. కాగా, నిజాముద్దీన్ మర్కజ్ మసీదుకు వెళ్లివచ్చిన వారిలో 160 మంది వివరాలు తెలియరాకపోవడంతో.. అందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం. వారి వివరాలు తెలిసిన వారు అధికారులు దృష్టికి తీసుకురావాలని కోరారు. వీరితో పాటు కరోనా వ్యాధి సోకిందన్న అనుమానాలు వున్న వ్యక్తులు కూడా అసుపత్రులకు వచ్చి పరీక్షలు చేయించుకోవచ్చునని తెలిపారు. ఇక వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో 17 మందిని ఇప్పటికే అధికారులు డిశ్చార్జి చేశారు. దీంతో ప్రస్తుతం కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 128 మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more