తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య పదకొండుకు చేరింది. కొత్తగా 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 127కు చేరుకుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ గత రాత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. ‘గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు కరోనా వైరస్ కారణంగా మరణించారు. నిజాముద్దీన్ మర్కజ్కు వెళ్లొచ్చిన వారికి, వారి వల్ల కుటుంబ సభ్యులకు మాత్రమే కొత్తగా వైరస్ సోకుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింద’ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన 30 మంది, చనిపోయిన ముగ్గురు కూడా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదుకు వెళ్లి వచ్చిన వారే’నని వివరించారు. ‘సోమవారం మరణించిన ఆరుగురిలో అయిదుగురు మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారే. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరికొంత మందికి వైరస్ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్ఛార్జి కూడా అయ్యారు. ఎవరి పరిస్థితీ ఆందోళనకరంగా లేదు. ఈ నేపథ్యంలో మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో మరో 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది’ అని వెల్లడించారు.
ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా ఉన్నవారు.. ఇంకా వీరితో కలిసామని భావించే వారు ఎవరైనా వైద్య పరీక్షలు నిర్వహించుకోకుండా ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. పరీక్షల అనంతరం ఎవరికైనా వైరస్ సోకినట్లు తేలినా, వారి ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన మెడికల్ కిట్స్ కూడా సిద్ధంగా ఉంచామని సీఎం వెల్లడించారు.
ఇదిలావుండగా, ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ఆధ్వర్యంలో నిర్వహించిన తబ్లీగి జమాత్ కార్యక్రమానికి తెలంగాణ నుంచి హాజరైన వారిలో మరో 160 మంది వివరాలు ఇప్పటికీ లభ్యం కాలేదు. ఇప్పటివరకు దాదాపు 500 మంది నుంచి నమూనాలు సేకరించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి సంబంధీకుల్లో పలువురిని వివిధ ఆసుపత్రుల్లో చేర్చారు. చార్మినార్ వద్ద నిజామియా ఆసుపత్రిలో 80 మందిని, అమీర్ పేటలోని ప్రకృతి వైద్యశాలలో 200 మందిని, మెహిదీపట్నంలోని సరోజినీదేవి ఆసుపత్రిలో 110 మందిని ఉంచారు. కాగా, ఢిల్లీ వెళ్లి వచ్చిన 1030 మందిలో 160 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాకపోవడం ఆందోళనకరంగా మారింది. వీరి ద్వారా సుమారు రెండు వేల మందికి పైగా కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more