యవత్ ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. వేలాది మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న ఈ మహమ్మారి మన దేశంలోనూ పంజా విసురుతోంది. ప్రారంభంలో మన దేశంలో గణనీయంగా అత్యంత తక్కువ సంఖ్యలో నమోదైన కేసులు.. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన తరువాత కూడా అధిక సంఖ్యలో పెరగడం తీవ్ర అందోళన రేకెత్తించే అంశం. దేశవ్యాప్తంగా ఈ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారంనాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1965కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఇక ఇప్పటివరకు దేశంలో ఏకంగా 50మందిని ప్రాణాలను కరోనా వైరస్ కబళించి వేసింది. కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1764మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 151 మంది కొవిడ్-19 నుంచి కోలుకున్నారని.. కోలుకున్నవారందరినీ అసుపత్రుల నుంచి డిశ్చార్జి చేశారని తెలిపింది. కాగా, మహారాష్ట్రలో కొవిడ్-19 తీవ్రత అధికంగా ఉంది. తాజాగా ఇక్కడ మృతుల సంఖ్య 13కు చేరగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 335గా ఉంది. గుజరాత్లో కొవిడ్-19 మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మధ్యప్రదేశ్లో వైరస్ తీవ్రత పెరిగింది. మరణాల సంఖ్య ఆరుకు చేరగా 99పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
పంజాబ్లో 46కేసులు నమోదుకాగా నలుగురు మరణించారు. కర్ణాటక, పశ్చిమబెంగాల్లో ముగ్గురు చొప్పున మరణించారు. దిల్లీలో కొవిడ్- 19 తీవ్రత కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 152కు చేరగా ఇద్దరు మరణించారు. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జమ్మూ కశ్మీర్లో కొవిడ్19 కారణంగా ఇద్దరు మరణించారు. కేరళలో కొవిడ్ తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటికే ఇక్కడ 265కి పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇద్దరు మరణించారు. ఉత్తర్ప్రదేశలో లో 113కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. ఆంధ్రప్రదేశ్, బిహార్, హిమాచల్ప్రదేశ్, తమిళనాడులో ఒకరుచొప్పున మరణించారని ప్రభుత్వం వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more