కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ తరుణంలో పరోక్షంగా కూడా దీని ప్రభావం బారిన పడి పలువురు మరణిస్తున్నారు. కొందరు ఈ భయంకర మహమ్మారి గురించి తెుసుకుని అందోళన చెందిన మరణించగా, మరికొందరు దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో ఆకలికి తట్టుకోలేక అలమటించి మరణిస్తున్నారు. లాక్ డౌన్ తో యావత్ దేశంలో అన్నింటికీ తాళాలు పడ్డాయి. జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడిక్కడే ప్రజా రవాణా నిలిచిపోయింది. కేవలం నిత్యావస సరకులు, అత్యవసరం సేవలు మినహా అన్ని నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో అనుహ్యంగా తెరపైకి వచ్చిన ఈ పరిణామాలతో రాష్ట్రంలో వున్న వలస కూలీలు, అభాగ్యులు, పేదలు, బీదలు, యాచకులు సహా పలువురు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. పలు స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి అభాగ్యుల ఆకలిని తీరుస్తున్నారు. ఈ తరుణంలోనే క్షుద్భాధకు తాళలేక ఓ ఓ వృద్ధుడు మరణించాడు. ఈ విషాద ఘటన ఎక్కడో మారుమూల గ్రామంలో జరగలేదు. అంతర్జాతీయ నగరంగా బాసిల్లుతున్న హైదరాబాద్ నడిబొడ్డున చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే,, మెహదీపట్నం ప్రాంతంలోని హుమాయిన్ నగర్ లో 60 సంవత్సరాలున్న ఓ వృద్ధుడు ఫుట్ పాత్ పైపడి సృహకోల్పోయి ఉన్నాడు. అచేతనంగా వున్న ఆ వృద్దుడిని.. ఇవాళ ఉదయం ఈ ప్రాంతం గుండా వెళ్తున్న పోలీసులు గుర్తించారు. అతని వద్దకు వెళ్లగా.. సార్ చాలా ఆకలిగా వుంది.. ఏమైన తెచ్చిపెట్టండీ అని అడిగాడు. దీంతో చలించిపోయిన పోలీసులు.. అతడికి ఏమైనా అందించాలని వెళ్లారు. స్థానికంగా అన్ని బంద్ కావడంతో చివరాఖరకు పండ్లు తీసుకువచ్చారు. అయితే వారు తిరిగిరావడం కాసింత ఆలసమయ్యిందో ఏమో వృద్దుడు అప్పటికే పూర్తిగా నిరసించి సృహకోల్పోయాడు.
పోలీసులు అతన్ని అసుపత్రికి తరలించగా, అతడు మరణించాడని అక్కడి వైద్యులు తెలిపారు. తన తుది కోరిక కూడా తీరకుండానే వృద్దుడు ప్రాణాలు వదలడం పోలీసుల గుండెలను కూడా కదిలించింది. చివరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలిచివేసింది. ఇతను గతకొన్ని రోజులుగా ఫుట్ పాత్ పైనే ఉంటున్నాడని, ఆకలితో అలమటిస్తున్నాడని సమాచారం. ఇతను ఎక్కడి వాడు ? ఇతరత్రా వివరాలు తెలియాల్సి ఉంది. ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు ఆదుకునేందుకు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చినా ఈ మరణం చోటుచేసుకోవడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more