కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తున్న వార్తలు వింటూనే ప్రజలు తీవ్ర భయాందోళనకు చెందుతున్నారు. ఈ క్రమంలో మన రాష్ట్రంలో కరోనా కేసులు నమోదైనా.. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందకుండా అన్ని చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. లాక్ డౌన్ ప్రకటించింది. అయినా అందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వ ఆంక్షలను పాటించాలని కూడా అదేశించారు. తాజాగా రాత్రి పూఠ కర్ప్యూను కూడా విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇలా కఠిన చర్యలు తీసుకన్న 24 గంటల వ్యవధిలోనే తెలంగాణవాసులు కలవరానికి గురయ్యే విషాద వార్త వినాల్సి వచ్చింది.
తెలంగాణ అరోగ్యశాఖ, వైద్యులు, ప్రభుత్వం చేస్తున్న చర్యలతో ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లి వచ్చిన ఒక్క బాధితుడు మాత్రమే మృతి చెందాడని, మిగిలినవారందరూ కోలుకుంటున్నారని ప్రకటించిన మరుసటి రోజునే మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 11 మంది కరోనా వైరస్ బాధితులు కూడా ఆ మహమ్మారి సోకినా బయటపడగలిగారిని చెప్పారు. ఇలాంటి గుడ్ న్యూస్ చెప్పిన తరుణంలోనే ఏకంగా తెలంగాణలో ఆరుగురు కరోనా బాధితులు మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర వైద్య అరోగ్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది.
గాంధీ అసుపత్రిలో ఇద్దరు, అపోలో అసుపత్రిలో ఒకరు, గ్లోబల్ అసుపత్రిలో ఒకరు, నిజామాబాద్ జిల్లాలో ఒకరు, గద్వాలలో మరోకరు మొత్తం ఆరుగురు మరణించారని వైద్యఅరోగ్యశాఖ పేర్కొంది. ఈ నెల 13 నుంచి 15 వరకు దేశరాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మార్కజ్ లో మతపరమైన ప్రార్థనలు జరిగాయని.. మృతులందరూ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ప్రార్థనల్లో పాల్లోన్నారని సమాచారం. ఆనంతరం వీరందరూ స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల తరువాత వీరందరూ కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరికి రక్త పరీక్షలు నిర్వహించాగా వీరిలో కొందరికి కరోనా పాజిటివ్ అని తేలింది. తీవ్రమైన దగ్గు, జర్వ బారిన పడిన వీరు అసుపత్రులలో చికిత్స పోందుతూ మరణించారు. అయితే వీరి ద్వారా వైరస్ సోకే ప్రమాదం కూడా వుందని వారు ఎవరిని కలిశారు.. ఏయే అసుపత్రులకు వెళ్లారు. అన్న వివరాలను ఆరోగ్య శాఖ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది.
దీంతో కరోనా వ్యది సోకే ముప్పు వుందని అనుమానితులను ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గుర్తించే పనిలో వున్నాయి. అనుమానిలను అసుపత్రులకు తరలింిచిన అధికారులు వారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు వీరిని క్వారంటైన్ లో వుంచారు. ఈ ప్రార్థనల్లో పాల్గోన్న వారందరూ విధిగా తమ సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకురావాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. మర్కజ్ లో జరిగిన మతపర సమావేశాలకు హాజరైన వారి వివరాలను తెలిసినవారు తప్పనిసరిగా అధికారులకు తెలియజేయాలని కోరారు. దీంతో భయకంరమైన మహమ్మారిని ప్రభావానికి ఎక్కువ మంది ప్రజలు గురికాకుండా కాపాడుకోవచ్చునని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more