యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రాణాంతక వైరస్ నివారణకు వ్యాక్సిన్, మందులు కనుగొనేందుకు ఎన్నో ప్రయోగశాలలు బిజీగా ఉన్నాయి. అలాగే, వైరస్ బారిన పడిన వారిని రక్షించేందుకు మెరుగైన వైద్య చికిత్స కోసం కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ ఆసుపత్రి కొత్త చికిత్సను అవలంబిస్తోంది. కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తి రక్తాన్ని ఇప్పుడు వైరస్తో పోరాడుతున్న బాధితుడికి మార్పిడి చేయడం ద్వారా చికిత్స కోసం ప్రయత్నిస్తున్నట్టు హూస్టన్లోని మెథడిస్ట్ ఆసుపత్రి తెలిపింది.
కరోనా నుంచి కోలుకున్నాక రెండు వారాల పాటు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రక్తంలోని ప్లాస్మాతో చికిత్స ప్రారంభించినట్టు చెప్పింది. వందేళ్ల క్రితం వచ్చిన ‘స్పానిష్ ఫ్లూ’ వ్యాధికి కూడా ఇలానే చికిత్స చేశారని మెథడిస్ట్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది వైరస్పై దాడి చేయడానికిఉపయోగ పడుతుందని శాస్త్రవేత్తల అభిప్రాయం. కరోనాకు గురైన రోగులకు సహాయక చర్యలు చేయడం మినహా మరే ప్రత్యేక చికిత్స చేయలేకపోతున్నారని, అందుకే ‘కాన్వాలెసెంట్ సెరెమ్ థెరపీ’ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నట్టు మెథడిస్ట్ ఆసుపత్రి చెప్పింది.
ఇందుకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్టు మెథడిస్ట్ శాస్త్రవేత్త డాక్టర్ ఎరిక్ సలాజార్ ప్రకటించారు. తమ దేశంలో కరోనా మరణాలు రెండు వేలు దాటడంతో ఈ ప్రయోగాన్ని వేగవంతం చేశామన్నారు. కరోనా నుంచి కోలుకొని తమ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 205 మంది నుంచి బ్లడ్ ప్లాస్మా సేకరించే పనిలో ఉన్నట్టు తెలిపారు. ఈ చికిత్సలో ‘కాన్వాలెసెంట్ సెరమ్ థెరపీ’ ఉపయోగపడుతుందని తేలితే తమ శక్తి మొత్తం దానిపైనే కేంద్రీకరిస్తామని ఆసుపత్రి సీఈఓ స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more