కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 25 మంది మృతి చెందారు. అయితే దీనిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలో భాగంగా ఎవరు బయటికి రాకూడదని, సామాజిక దూరం పాటించాలని, దీనివలన కరోనా వైరస్ నీ అరికట్టవచ్చని చెప్పుకొచ్చింది. అయితే జనాలు ఇదేమీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రజలకి బుద్ధి చెప్పాల్సిన ప్రజాప్రతినిధులు కూడా బయట తిరుగుతున్నారు. తాజాగా కర్ణాటక చెందిన ఓ ఎమ్మెల్యే తన మనవడితో కలిసి రోడ్లపైకి వచ్చి ఆటలు ఆడుతూ కనిపించారు. తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పే పదవిలో ఉండి ఇంత బాధ్యతారహితంగా ఆ ఎమ్మెల్యే ప్రవర్తించడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే.. తుమకూరు జిల్లా గుబ్బి నియోజకవర్గ జేడీఎస్ ఎమ్మెల్యే ఎస్.ఆర్.శ్రీనివాస్.. తన నివాస సమీపంలో హైవేపైకి మనవడితో కలిసి వచ్చి, ఆ పిల్లో డిని, ఛార్జింగ్ కారులో కూర్చొని డ్రైవింగ్ చేస్తుండగా ఆయన రిమోట్తో ఆపరేట్ చేశారు. మాస్కులు లేకుండానే సరదాగా ఆటలు ఆడుతూ చాలాసేపు గడిపారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నలుగురికి మంచి చెప్పాల్సిన ఆ ప్రజా ప్రతినిధి ఇప్పుడు ఇలా చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లాక్ డౌన్ అనేది ఇది కేవలం సామాన్య ప్రజలకు మాత్రమేనా? ప్రజా ప్రతినిధులకు వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు.. ఇక దీని పై కర్ణాటక ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. ఇక కరోనా వైరస్ రోజు రోజుకి చాప కింద నీరులా పరకుపోతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆరు లక్షల కేసులు నమోదయ్యాయి. 30 వేలకు పైగా మరణించారు. కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులసంఖ్య 83 కి చేరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more