ధేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో బిజేపి పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకునేలా అదేశాలను జారీ చేయాలని బీజేపి నేతలు దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం.. ఎమ్మెల్యేలను పార్టీ అదుపులోకి తీసుకుందన్ని అరోపణలపై స్పందిస్తూ వారిని వదిలిపెట్టాలని అదేశించింది. ఎమ్మెల్యేలు చట్టసభలకు హాజరవుతారా.? లేదా.? అన్న విషయం వారి ఇష్టానికే వదిలేసిన న్యాయస్థానం.. వారు ఎక్కడో బెంగళూరులోని హోటల్ లో ఎందుకు వున్నారని నిలదీసింది. ఇదే సమయంలో తమ ముందు ఎమ్మెల్యేలను హాజరపరుస్తామన్న వినతిని కూడా న్యాయస్థానం తోసిపుచచింది. ఇది సముచితం కాదని పేర్కోంది.
మధ్యప్రదేశ్ లో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోనే ఉంచాలన్న ఆకాంక్షతో, రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు మధ్యప్రదేశ్ నుంచి నేరుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి, అమృతహల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నగరంలోని రమడా హోటల్ లో క్యాంప్ వేసిన 21 మంది రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు వెళ్లిన దిగ్విజయ్ ని హోటల్ సమీపంలో పోలీసులు అడ్డుకోగా, ఆయన రోడ్డుపైనే బైఠాయించారు.
అంతకుముందు బెంగళూరుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ కు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ స్వాగతం పలికారు. ఆపై వారిద్దరూ కలిసి హోటల్ వద్దకు వెళ్లగా, ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం దిగ్విజయ్ మాట్లాడుతూ, తాను ఎంపీనని, 26న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, తమ ఎమ్మెల్యేలను ఇక్కడ దాచేస్తే, వారితో మాట్లాడాలని తాను వచ్చానని, కానీ పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. వాళ్లు వెనక్కు తిరిగి వస్తారనే తాను భావిస్తున్నానని, తమ ఎమ్మెల్యేలను ఇక్కడ బలవంతంగా నిర్బంధించారని ఆరోపించారు.
మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు పన్నిందని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఆపై ఆయన ఇతర నేతలతో కలిసి రోడ్డుపైనే టీ తాగారు. కాగా, తన వర్గం ఎమ్మెల్యేలతో సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేయగా, ప్రభుత్వం మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సి వుండగా, కరోనా ఎఫెక్ట్ తో కమల్ నాథ్ సర్కారు తాత్కాలికంగా బయటపడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more