ప్రపంచవ్యాప్తంగా మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి ఇటు మన దేశంలోనూ చాపకింత నీరులా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా 142 కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ అందోళన రెకెత్తిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ ప్రభావం మొదటి దశ దాటి రెండో దశకు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేయడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. దేశం మొత్తం మీద కరోనా వైరస్ వల్ల ముగ్గురు చనిపోయారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు అక్కడ 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడి పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆంక్షలను మరింత కఠినం చేసే ఆలోచనలో ఉన్నట్టు ఉద్దవ్ థాక్రే మోదీతో చెప్పినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ముంబైలో మాల్స్, థియేటర్స్, యూనివర్సిటీలను మూసివేశారు. పబ్లిక్ ఫంక్షన్స్, ఈవెంట్స్, అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం రవాణా వ్యవస్థపై కూడా కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు అనవసర ప్రయాణాలను తగ్గించుకోకపోతే.. రైళ్లు,బస్సులను కూడా నిలిపివేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
కొత్తగా పశ్చిమబెంగాల్లో తొలికేసు నమోదయింది. దీంతో కరోనా మహమ్మారి మన దేశంలో 16 రాష్ట్రాలకు పాకినట్లయింది. మహారాష్ట్రలోనే 41 మందికి ఈ వైరస్ సోకగా తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏపీలో ఒకరికి సోకింది. కరోనా విజృంభిస్తుండడంతో దేశంలోని పలు రాష్ట్రాలు ఏప్రిల్ 2వ తేదీ వరకు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. సినిమా థియేటర్లు, మాల్స్, జిమ్ సెంటర్లు కూడా మూసేశాయి. ఈ నెలాఖరు వరకు దేశవ్యాప్తంగా పాఠశాలలు, యూనివర్సిటీలతో సహా థియేటర్లు, వ్యాయామశాలలు మూసివేయాలని సూచించగా... తాజాగా అన్ని చారిత్రక కట్టడాలు, స్మారక చిహ్నాలు, కేంద్ర మ్యూజియాలను కూడా ఈ నెల 31 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more