బీహార్ ఎన్నికల నేపథ్యంలో సరిగ్గా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ఎన్ఆర్ఐ సొంత పార్టీని స్థాపిస్తూ ప్రకటనలు జారీ చేయడం రాష్ట్రంలో రాజకీయ సంచలనానికి కారణమయ్యింది. బీహార్ ను ప్రేమిద్దాం.. రాజకీయాలను ద్వేషిద్దాం అంటూ సరికొత్త నినాదంతో ముందుకెళ్తున్న ఈ నాయకురాలు.. తన పార్టీ తరపున అమె ముఖ్యమంత్రి అభ్యర్థి అని కూడా పేర్కొనడం గమనార్హం. జేడీయూ నేత బినోద్ చౌదరి కూతురు లండన్ లో స్థిరపడిన పుష్పమ్ ప్రియాచౌదరి ఇంతటి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు అమె హిందీ, ఇంగ్లీషు దినపత్రికల్లో పెద్ద ఎత్తున్న ప్రచార ప్రకటనలు ఇవ్వడంతో రాష్ట్రంలో కొత్త పార్టీ అవిర్భావించిందని విషయం కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. తన పార్టీలో ఒక్కరు.. నియంత తరహా పాలన వుండదని, ఇక్కడ ప్రతీ ఒక్కరూ తమ రాష్ట్రాన్ని పాలించుకునే అవకాశం వుండేలా.. అంతటి జనరంజకంగా పాలన సాగుతుందని, అమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా పోస్టు చేశారు. బీహార్ దిశానిర్ధేశం కావాలని, వాటివైపు శరవేగంగా పయనించేందుకు రెక్కలు కూడా తొగడాలని, ఇది మార్పుతోనే సాధ్యమని, ఆప్పుడే అభవృద్ది సాధ్యమవుతుందని, బీహార్ కు ఉత్తమోత్తమం కావాల్సిన సమయం ఆసన్నమైందని ప్రియా చౌదరి పేర్కోంది.
రాజకీయాలపై విరక్తి వచ్చేస్తోందని.. అందుకనే తమ పార్టీ రాష్ట్రాన్ని ప్రేమించమని, రాజకీయాలను ద్వేషింద్దామన్న నినాదంతో ముందుకెళ్తోందని అమె ప్రకటనలో పేర్కోన్నారు. తమ పూరల్స్ పార్టీతో కొత్తపుంతలు తొక్కడం ఖాయమని ఇక తన పార్టీలో చేరేందుకు సిద్దాంతాలు నచ్చిన వారు రావచ్చని కూడా అమె బాహాటంగా పిలుపునిచ్చారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్న తాను రాష్ట్రంలో సమగ్రమార్పుకు పలు విషయాలను రాష్ట్ర ప్రజలతో త్వరలో పంచుకుంటానని చెప్పారు. రాజకీయాల్లో ఎవరు, ఎప్పుడు, ఎలా ప్రవేశిస్తారో ఎవరికీ తెలియదంటూ ఆమె పేర్కొంది. ఆమె తన రాజకీయ రంగ ప్రవేశం గురించి కొన్ని రోజుల నుంచి వరుస ట్వీట్లు చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more