రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య కేసులో వైద్యులు నిర్వహించిన మృతదేహానికి పోస్టుమార్టం నివేదిక ఇవాల పోలీసులకు అందింది. కాగా, మారుతిరావు బ్రెయిన్ డెడ్, కార్టియాక్ అరెస్టు కారణంగా మరణించాడని ఈ నివేదిక స్పష్టం చేస్తున్నట్లు వైద్యులు, తమ ప్రాథమిక నివేదికలో పేర్కోన్నారని పోలీసులు తెలిపారు. అంతేకాదు ఆయనది పూర్తిగా ఆత్మహత్యేనని ఈ నివేదిక స్పష్టం చేస్తున్నట్లు కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఆయన శరీరంపై ఎటువంటి గాయాలు లేవని వైద్యులు తమ నివేదికలో పేర్కోన్నట్లు తెలుస్తోంది. విషం తీసుకోవడం వల్లే ఆయన బ్రెయిన్ డెడ్, గుండెపోటు కారణంగా మరణించారని వైద్యుల బృందం తమ రిపోర్టులో పేర్కొందని సమాచారం. మారుతీరావు మృతదేహం రంగు మారడానికి కూడా ఈ విష ప్రభావమే కారణమని వెల్లడించింది. విషం తీసుకున్న తరువాత ఆయన శరీరంలో రక్త ప్రసారానికి అవాంతరాలు ఏర్పడ్డాయని, ఫలితంగా రెండు నుంచి మూడు గంటల వ్యవధిలోనే ప్రాణాలు పోయి ఉంటాయని తమ పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.
కాగా తన వల్లే తన తండ్రి మారుతిరావు చనిపోయాడంటే తాను అంగీకరించేది లేదని ఆయన కుమార్తె అమృత స్పష్టం చేసింది. తన తండ్రి ఇంట్లో ఆస్తి వ్యవహరాల్లో ఏర్పడిన వివాదాలపై అందరికీ తెలిసిందేనని, వాటివల్లే ఆయన ఈ విపరీత చర్యకు పాల్పడివుండవచ్చునని అమె అన్నారు. అయితే అల్లుడిని చంపానన్న పశ్చాతాపం కూడా వెంటాడి ఉండవచ్చునని అన్నారు. తన భర్త హత్య చేయించినప్పుడే తనకు ఆయనపై వున్న ప్రేమ తొలగిపోయిందని.. అయితే తన తండ్రిని చివరిసారిగా చూడాలని వుందని మాత్రం అమె చెప్పింది.
కాగా, తన తండ్రి కడసారి చూపుకు, అంతిమ సంస్కారాలకు తాను హాజరైయ్యేందుకు తన తల్లి గిరిజ, తన బాబాయ్ శ్రావణ్ లు అంగీకరించలేదని అమె తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను అమృత బాబయ్ తోసిపుచ్చారు. మారుతిరావు అంత్యక్రియలకు రావొద్దని అమృతకు తాము చెప్పిలేదని ఆయన అన్నారు. ఇంతటి విషాదసమయంలోనూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరోవైపు, మిర్యాలగూడలోని మారుతీరావు ఇంటి వద్ద ఆయన భౌతికకాయానికి బంధువులు, సన్నిహితులు నివాళులు అర్పించిన అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమైంది. కాగా, అంతిమయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more