ఏ కష్టం వచ్చినా.. బాధ వచ్చినా.. చివరికు ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి సంబంధించిన ఏ సమస్య తలెత్తినా.. ముందుగా గుర్తుకువచ్చేది భగవంతుడే. కొందరు ‘‘ఆయ్యా ఈ కష్టాలను గట్టెకిస్తే నీ కొండకు వస్తా’’మని అనుకుంటారు.. ఇంకోందరు.. ‘‘నీ కొండకు వస్తున్నాం.. ఇక ఈ సమస్యను పరిష్కార బాధ్యత నీదే’’అంటూ అంతా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిపై వేస్తుంటారు. భక్తుల ఆపద మొక్కులను తీర్చేవాడు కాబట్టే ఆయనకు ఆపద మొక్కుల వాడా అని కూడా భక్తులు పిలుస్తుంటారు. అయితే ఇలాంటి భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా ఆంక్షలు విధించింది.
ప్రపంచ వ్యాప్తంగా జడలు విప్పుతూ.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. భక్తులకు పలు కీలక సూచనలు చేసింది. జలుబు, దగ్గుతో బాధపడే భక్తులు తిరుమల రావొద్దని విజ్ఞప్తి చేసింది. ఇటువంటి వారు దర్శనానికి వస్తే భక్తుల రద్దీ కారణంగా వైరస్ మరింత వ్యాపించే అవకాశం ఉందని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది. స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల్లో ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తే వెంటనే వారిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)కు తరలించాలని నిర్ణయించింది. అలాగే, భక్తులు శానిటైజర్లు, మాస్కులతో రావాలని సూచించింది.
విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు విమానాశ్రయాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నందున్న వారుని స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్న బోర్డు.. దేశీయ భక్తులపై మాత్రం ఎలాంటి పరీక్షలు చేయడం లేదని.. అందుకనే ఈ వ్యాధి లక్షణాలు వున్న భక్తులు తమంతట తాము తిరుమలకు రాకూడదని ముందస్తు నిర్ణయాలు తీసుకోవాలని కోరింది. అంటువ్యాధి కావడంతో మిగతా స్వామివారి భక్తులకు ఈ వ్యాధి సోకే ముప్పు వున్నందున.. ఈ లక్షణాలు వున్న భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more