Nirbhaya case convict moves SC న్యాయవాది మార్పు కోరుతూ సుప్రీంలో ముఖేష్ పిటీషన్..

Nirbhaya case convict moves sc seeking restoration of his legal remedies

Nirbhaya convicts, Execution, Pawan Gupta, Curative petition, Supreme court, Patiyala Court, Death Sentence, Tihar Jail authorities, Nirbhaya case convicts, Tihar jail, Nirbhaya convicts hanging, Nirbhaya case, Nirbhaya convicts Curative petition, Satish Kumar Arora, Supreme Court, nirbhaya murder case Pawan Gupta, Mukesh singh, Vinay Sharma, Akshay Thakur, Nirbhaya, Murder, Rape, gang-rape, Tihar jail, Crime

Mukesh Singh, one of the four death row convicts in the Nirbhaya gang-rape and murder case, moved a plea in the Supreme Court on Friday seeking restoration of all his legal remedies, alleging that his lawyers had misled him.

నిర్భయ కేసు: న్యాయవాది మార్పు కోరుతూ సుప్రీంలో ముఖేష్ పిటీషన్..

Posted: 03/07/2020 02:06 PM IST
Nirbhaya case convict moves sc seeking restoration of his legal remedies

దేశవ్యాప్తంగా పెనుసంచలనం రేపిన నిర్భయ అత్యాచరం హత్యకేసులోని నలుగురు నిందితులకు నాలుగో పర్యాయం ఢిల్లీలోని పాటియాల కోర్టు డెత్ వారెంట్ జరీ చేసిన నేపథ్యంలో దాని నుంచి తప్పించుకునేందుకు దోషులు మరో ప్రయత్నానికి తెరలేపారు. గత మూడు పర్యాయాలు వారికి మరణశిక్ష అమలు తేదీ సమీపించగానే ఏదో ఒక పిటీషన్ వేసి.. శిక్ష అమలులో జాప్యం చేసేందుకు చర్యలు తీసుకున్న దోషులు.. తాజాగా మరో పర్యాయం అదే ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారా.? అంటే ఔనని చెప్పక తప్పదు.

పటియాలా కోర్టు వీరికి తొలిసారగా జనవరి 22న ఉరిశిక్షను అమలు చేయాలని డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో దోషుల్లో ఒకరు సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటీషన్ వేశారు. దీంతో ఫిబ్రవరి 1 తేదీన మరోమారు దోషులకు మరణశిక్ష అమలు చేయాలని న్యాయస్థానం డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ సమయంలో దోషుల్లో మరోకరు క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి పిటీషన్ దాఖలు చేయడంతో అది పెండింగ్ లో వున్నందున వాయిదా పడింది. ఈ క్రమంలో మూడువ పర్యాయం మార్చి 3న మరోమారు దోషులకు మరణ శిక్ష అమలు చేయాలని అదేశిస్తూ న్యాయస్థానం డెత్ వారెంట్ జారీచేయగా, అక్షయ్ మెర్సీ పిటీషన్ నేపథ్యంలో వాయిదా పడింది.

ఇక నాలుగో పర్యాయం తాజాగా మార్చి 20వ తేదీ నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష విధించాలని న్యాయస్థానం డెత్ వారెంట్ జారీ చేయగా, దాని నుంచి తప్పించుకునే తరుణోపాలను దోషులు తమ మెదళ్లకు పదపు పడుతున్నారు. ఈదఫా తమ ఉరిశిక్షపై స్టే కోరుతూనే.. లేక క్షమాభిక్ష కోరుతూనో.. లేక యావజ్జీవ వేయమనో కాదు.. తన లాయర్ నే మార్చాలని కోరుతూ తాను ఏర్పాటు చేసుకున్న లాయర్లపైనే ఆరోపణలు చేశాడు. వారు తనను తప్పుదారి పట్టించారని అత్యంత తెలివిగా న్యాయస్థానంలో పిటీషన్ వేశాడు.

అదేంటి ఇలా చేశాడనే లోపు.. తన మనస్సులో వున్న అసలు విషయాన్ని బయటపెట్టాడు. అదేంటి అంటే చట్టపరంగా తనకుండే అవకాశాలను మళ్లీ వినియోగించుకునేలా మరో అవకాశానికి అనుమతించాలని కోరుతూ నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ముకేశ్ తరపున ఎంఎల్ శర్మ అనే న్యాయవాది క్యురేటివ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన విషయంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు ఢిల్లీ సర్కారు, అమికస్ క్యూరీగా వ్యవహరించిన వ్రిందా గ్రోవర్‌లు నేరపూరిత కుట్రకు పాల్పడి తనను మోసం చేశారని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరాడు. ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles