తీవ్ర అర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ప్రైవేటు రంగ యస్ బ్యాంకు వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ డిపాజిట్లపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్న వేళ.. ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ నివాసంలో నిన్న రాత్రి ఈడీ సోదాలు నిర్వహించింది. డీహెచ్ఎఫ్ఎల్కు యస్ బ్యాంకు ఇచ్చిన రుణాలు నిరర్థక ఆస్తులుగా మారడం వెనక కపూర్ పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో కార్పొరేట్ సంస్థకు ఇచ్చిన రుణాల్లోనూ కపూర్ పాత్ర ఉందని అనుమానిస్తున్నారు. తీసుకున్న రుణాలకు ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి కొంత సొమ్ము కపూర్ భార్య ఖాతాల్లోకి చేరినట్టు అభియోగాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ఆయన నివాసంలో ఈడీ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. యస్ బ్యాంకు ప్రస్తుత పరిస్థితికి ఇది కూడా ఓ కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఆయన మాత్రం తనకు బ్యాంకు ఇంతటి నష్టాల్లోకి జారుకుందన్న విషయం తెలియదని అన్నారు. తాను ఎంతో కష్టపడి పదేళ్ల కాలంలో బ్యాంకును ఉన్నతస్థాయికి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు ఎస్ బ్యాంకు పరిస్థితుల గురించి వింటుంటే విస్మయం కలుగుతోందని అన్నారు. ఎస్ బ్యాంకులో తన చివరి వాటాను 2019 నవంబరులో అమ్మేశానని తెలిపారు.
అంతకుముందు నుంచే తనకు సంస్థతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఎస్ బ్యాంకులో ఇంత జరుగుతోందన్న విషయం తనకు తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే యస్ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తమ డిపాజిట్లు ఏమైపోతాయోనన్న అనిశ్చితి వారిలో అంతకంతకు పెరుగుతోంది. డిపాజిటర్లకు ఎలాంటి నష్టం జరగదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా వెల్లడించడం వారికి కాస్త ఊరటనిచ్చింది.
(And get your daily news straight to your inbox)
Jan 25 | అగ్రరాజ్యంలో ఎందరు అధ్యక్షులు మారినా అక్కడి ప్రజల్లో తుపాకీ సంస్కృతిని నియంత్రించే అంశంలో మాత్రం మార్పు తీసుకురాలేకపోతున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఈ విషయంలో ఏదో చేయాలని తాను అనుకున్నా.. చివరకు... Read more
Jan 21 | తెలంగాణ అధికార పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తనయ.. షేక్ పేట్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డీలు పరస్పరం బంజారాహీల్స్ పోలిస్ స్టేషన్లో పిర్యాదు చేసుకున్నారు. అదేంటి కేకే తనయ విజయలక్ష్మి... Read more
Jan 21 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలతో ఏకీభవించని న్యాయస్థాన ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘం వాదనలను బలపరుస్తూ రాష్ట్రంలో... Read more
Jan 21 | టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేయలేదని, కేవలం విచారణకు మాత్రమే పిలిచామని విజయనగరం జిల్లా ఎస్పీ బి రాజకుమారీ తెలిపారు. రామతీర్థాన్ని టీడీపీ నేతలు సందర్శించిన రోజున జరిగిన ఘటనపై... Read more
Jan 21 | అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రెండో పర్యాయం బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ ను గణనీయమైన ఓట్లతో ఓడించి.. ఆయన... Read more