ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపూర్ణ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 73వ రోజుకు చేరాయి. తాము ఏ ప్రాంత అభివృద్దికి వ్యతిరేకం కాదని.. అయితే అభివృద్ది వికేంద్రీకరణకు తామూ మద్దతునిస్తున్నామని రైతులు పేర్కోన్నారు. కానీ రాజధాని వికేంద్రీకరణకు మాత్రమే తాము వ్యతిరేకమని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతలు దీక్షలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేస్తోందని అశాభావంతో వున్నారు అమరావతి రైతులు.
మరో వైపు అమరావతిలో ఇవాళ స్వల్ప ఉద్రిక్తత వాతావరణం అలుముకుంది. రాజధాని ఇక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న అమరావతి రైతుల దీక్షా శిభిరాల మీదుగా వైసీపీ ర్యాలీ వెళ్లడమే ఇందుకు కారణమైంది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై కొన్నిరోజులక్రితం దాడి జరిగిందంటూ వైసిపీ కార్యకర్తలు ఇవాళ ర్యాలీ చేయడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మద్దతుగా ర్యాలీలో నినాదాలు చేశారు. తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి గ్రామాల మీదుగా ..రైతుల దీక్షా ప్రాంగణాల ముందు నుంచి వైకాపా శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి.
రైతుల దీక్షా శిబిరాల వద్దకు రాగానే ‘జై జగన్’ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా.. అందుకు ప్రతిగా రైతులు, మహిళలు ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. పోటా పోటీ నినాదాలతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ర్యాలీ దృష్ట్యా మందడం, వెలగపూడిలో పోలీసులు భారీగా మోహరించారు. న్యాయం చేయాలని కోరుతూ 73 రోజులుగా దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం.. తమ పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను రెచ్చగొట్టే విధంగా ర్యాలీ నిర్వహించిన నేతలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more