మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉతన్నమైన పరిణామాలకు పోలీసుల నిర్లక్ష్యం కూడా తోడందైన్న విమర్శలు వినిపించాయి. సుమారు మూడున్నర గంటల పాటు కారులోనే కూర్చున్నా.. పోలీసులు అధికార వైసీపీ పార్టీ కార్యకర్తలను చెదరగొట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ నేతలు విమర్శించారు.
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం ఉదయం విశాఖ విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబును.. వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న పరిణామాలపై ఇవాళ రాష్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో విచారణ జరిగింది.
విశాఖ విమానాశ్రయం బయట వైసీపీ కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపిస్తూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఇరు పక్షాల వాదనలను ఆలకించింది. సెక్షన్ 151 కింద చంద్రబాబుకు డీసీపీ స్థాయి అధికారితో నోటీసు ఇప్పించి ఆయన్ను ముందస్తు అరెస్ట్ చేశారని శ్రావణ్ కుమార్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. సెక్షన్ 151 కింద రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసు ఇవ్వడాన్ని తప్పుబట్టారు.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ చంద్రబాబు భద్రత దృష్ట్యా నోటీసు ఇచ్చి ముందస్తుగా అరెస్ట్ చేశామని న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. ఒక వ్యక్తి నేరం చేయకుండా ఉండేందుకు, అతన్ని అదుపు చేసేందుకు 151 సెక్షన్ను ఉపయోగించాలని.. నోటీసు ఇచ్చిన ప్రకారం చూస్తే ఈ కేసు వ్యవహారం అలా లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు సెక్షన్ 151 కింద ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నట్లు నోటీసు ఎలా ఇచ్చారని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని డీజీపీతో పాటు విశాఖ పోలీసులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more