రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోట లాల్సోట్ వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. బూండీలోని కోట లాల్ సాత్ మెగా హైవేపై బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న కొంతమందిని అధికారులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
పెళ్లి వేడుక నిమిత్తం వరుడి కుటుంబం, బంధువులతో కోట నుంచి సవాయ్ మాధోపూర్ వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్ నదిలో బోల్తాపడింది. ఘటన సమయంలో బస్సులో వున్న కొందరిని స్థానికులు కాపాడారు. కాగా మృతుల్లో 10 మంది మహిళలు, 11 మంది పురుషులు, నలుగురు చిన్నారులు వున్నారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలోనే పది మంది చనిపోగా, ఆసుపత్రులకు తరలిస్తుండగా 15 మంది మరణించారని తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కాగా క్షతగాత్రులలో మరో 5 మందికి పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. కాగా వంతెనలోకి దూసుకెళ్లకుండా ఇరువైపులా ఎలాంటి రక్షణ గోడలు కానీ, నిర్మాణాలు కానీ లేవని సమాచారం. మృతులందరూ కోటాకు చెందిన ఓ కుటుంబం బంధువులు కావడంలో ఇప్పుడా ఇంట్లో విషాధఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై నాగౌర్ ఎంపీ హనుమాన్ బెనీవాల్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా తన తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more