కర్ణాటకలోని బెంగళూరులో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ ఫౌరుల గణనలను (ఎన్ఆర్సీ) వ్యతిరేకిస్తూ నిర్వహించిన సభలో ఓ యువతి చేసిన నినాదాలు కలకలం సృష్టించాయి. యువతి నినాదాలతో షాక్ కు గురైన నిర్వాహకులు అమె నుంచి మైక్ లాగేసుకున్నా అమె వినిపించుకోలేదు.. అప్పటికే అమెను పక్కకు లాగుతున్న అమె వేదికపై నుంచి మైక్ లేకుండానే ఏదో చెప్పబోయింది. ఈ క్రమంలో అమెను నిర్వహకులు, పోలీసులు కిందకు తీసుకెళ్లారు. పోలీసులు విద్యార్థినిపై దేశ ద్రోహం కింద కేసు పెట్టారు కటకటాల వెనక్కి పంపారు.
ఈ సభకు ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు... అయితే, ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత అమూల్య అనే యువతి.. మైక్ అందుకుని.. పాకిస్థాన్ జిందాబాద్.. పాకిస్థాన్ జిందాబాద్.. అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది.. అయితే, ఆ యువతిపై బెంగళూరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. అంతేకాకుండా.. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆమె బెయిల్ను తిరస్కరించారు.. 14 రోజుల పాటు కస్టడీ విధించారు. కాగా, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగించి వెళ్లిపోతున్న సమయంలో.. ఆ యువతి పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసింది.
యువతి వ్యాఖ్యలు విన్న ఒవైసీ షాక్ కు గురయ్యారు.. వెంటనే ఆమె దగ్గరున్న మైక్ను లాక్కొన్నే ప్రయత్నం చేశారు.. ఆయినా వినని ఆ యువతి.. అప్పుడు హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినదించింది.. అనంతరం.. ఆమె దగ్గరున్న మైక్ను నిర్వహకులు తీసుకోగా.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.. ఇక, ఈ ఘటనపై స్పందించిన ఒవైసీ.. ఆ యువతి ఎవరో తమకు తెలియదని, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, భారత్ కోసమే ఉంటామని, పాకిస్థాన్కు ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు ఒవైసీ.
#WATCH The full clip of the incident where a woman named Amulya at an anti-CAA-NRC rally in Bengaluru raised slogan of 'Pakistan zindabad' today. AIMIM Chief Asaddudin Owaisi present at rally stopped the woman from raising the slogan; He has condemned the incident. pic.twitter.com/wvzFIfbnAJ
— ANI (@ANI) February 20, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more