మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు పురాతన శివాలయాలకు భక్తులు పొటెత్తారు. ఇటు శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతి ఆలయాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు శివాలయాలను దర్శించుకుంటున్నారు. రాజమండ్రిలో గోదావరి ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పంచారామ క్షేత్రం అయిన ద్రాక్షారామం, కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి, మురమళ్ళ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి, క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంది.
ఇక తెలంగాణలోని వేములవాడ రాజన్న దేవాలంయంతో పాటు కీసరలోని రామలింగేశ్వరాలయం, కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయం, పటాన్ చెరువు బీరంగూడలోని భ్రమరాంభికా మల్లిఖార్జున స్వామి దేవాలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరి ఆదిదేవుడికి పూజలు అందిస్తున్నారు. ప్రత్యేక అభిషేకాలు, అర్చనలతో నీలకంఠుడి పట్ల ఉన్న భక్తిని చాటుకుంటున్నారు. ‘ఓం నమ: శివాయ’ మంత్రోచ్చరణతో ఆ త్రినేత్రుడి యందు మనసుని లగ్నం చేసి తన్మయత్వం పొందుతున్నారు. గోదావరి పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్నారు.
రాజరాజేశ్వరుడి ఆలయానికి భక్తుల తాకిడి
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో వేములవాడ జనసంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజన్న దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అర్చకులు, అధికారులు శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ అర్చకులు, అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి శ్రీవెంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ ఆలయంలో అర్జిత సేవలు రద్దు చేసి భక్తులకు మహా లఘు దర్శనం ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన, రాత్రి 11.30 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. శివరాత్రి మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్వామి వారి దీవెనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు.
దేశవ్యాప్తంగా అన్ని శివాలయాలకు భారీగా భక్తజనుల తాకిడి నెలకొంది. దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అలంకరణలతో ఆలయ ప్రాంగణాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఉజ్జయినిలోని శ్రీ మహాకాలేశ్వరాలయం, వారణాసీలోని కాశీ విశ్వనాధస్వామి సహా శ్రీశైలం, మహారాష్ట్ర నాసిక్ లోని త్రయంబకేశ్వర ఆలయం, చార్ ధామ్ లుగా ప్రసిద్ది చెందిన శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more