ఐఐటీ మద్రాస్ క్యాంపస్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. క్యాంపస్ లోని విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన స్కాలర్.. నిసిగ్గుగా మహిళల రెస్ట్ రూమ్ లో తన మొబైల్ ఫోన్ కనబడకుండా పెట్టి అక్కడి దృశ్యాలను బంధించేందుకు యత్నించి అడ్డంగా అడ్డంగా బుక్కయ్యాడు. విద్యార్థిని పిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రాజెక్టు అధికారిగా పనిచేసే శుభం బెనర్జీగా గుర్తించిన పోలీసులు.. అతడ్ని కటకటాల వెన్కకి పంపించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో పీహెచ్డీ చేస్తున్న విద్యార్థిని ఐఐటీ మద్రాస్లో రీసెర్చి కోసం వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం ఏరోస్పేస్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ల్యాబ్ వద్ద రెస్ట్ రూమ్కు వెళ్లింది. అక్కడ కిటికీ వద్ద మొబైల్ ఫోన్ ఉన్నట్టు గుర్తించి.. తీసి చూడగా ఫోన్ కెమెరా ఆన్లో ఉన్నట్టు గుర్తించింది. వెంటనే గది నుంచి బయటకు వచ్చేసి పురుషుల బాత్ రూమ్ను లాక్ చేసింది. అనంతరం రక్షణ సిబ్బందిని పిలిచింది.
ఐఐటీ మద్రాస్ క్యాంపస్ భద్రతా సిబ్బంది వచ్చి బాత్ రూమ్ను తెరిచి చూడగా.. అందులో శుభం బెనర్జీ ఉన్నట్టు గుర్తించారు. ఫోన్ను స్వాధీనం చేసి చూడగా అందులో వీడియోలు, ఫొటోలు కనిపించలేదు. విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బెనర్జీని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. మొబైల్లో ఎలాంటి వీడియోలు లభించలేదనీ.. ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు చెప్పారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more