మాట తప్పం.. మడమ తప్పం అని ప్రచారం చేసుకున్న వైసీపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ విషయంలో వెనక్కు తగ్గిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. రైతులను సులభంగా మోసం చేయవచ్చునని పదే పదే వైసీపీ ప్రభుత్వం వారినే మోసం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన 48 గంటల్లో సొమ్ము చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ధాన్యం పంటను అమ్మి వారాలు గడుస్తున్నా ఇప్పటికీ సొమ్ము రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో రైతు సంక్షేమమంటూ వాగ్దానాలు చేసిన వైసీపీ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక బకాయిలు కూడా చెల్లించడంలేదని ధ్వజమెత్తారు. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను మోసం చేసేందుకు అన్ని ఎత్తులు వేస్తున్న ప్రభుత్వం.. ఇక తాజాగా రాష్ట్ర రైతాంగాన్ని యావత్తు మోసం చేసేందుకు సన్నధమయ్యారని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు రూ.2016 కోట్లు చెల్లించాల్సి ఉందనీ.. ఈ మొత్తం రోజురోజుకీ పెరుగుతూ వస్తోందని పేర్కొన్నారు.
లక్ష మందికి పైగా రైతులు తాము అమ్మిన పంటకు రావాల్సిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. రెండో పంటకు అవసరమైన పెట్టుబడికి డబ్బులు లేక రైతాంగం ఇబ్బందులుపడుతుంటే సంబంధిత శాఖలేం చేస్తున్నాయని పవన్ నిలదీశారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో పంట డబ్బులు చెల్లిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరిచిపోయిందని మండిపడ్డారు. ధాన్యం అమ్మిన నెల రోజులకు కూడా సొమ్ము చేతికి రాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఖరీఫ్ పంట కొనుగోలు, సొమ్ముల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు నిధులు కేటాయించారా.. లేదా? కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని జనసేనాని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more