న్యూజిలాండ్ పర్యటనను టీమిండియా శుభారంభం చేసింది. సుదీర్ఘ పర్యటన నేపథ్యంలో వచ్చి రావడంతోనే అతిథ్యజట్టుతో తలపడిన విరాట్ సేన తొలి టీ20లో ఆరువికెట్లతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఆక్లాండ్ వేదికగా ఈడెన్ పార్కులో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో కివీస్ విసిరిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 6 బంతులు మిగిలి ఉండగానే అవలీలగా ఛేదించేసింది. ఆరంభంలోనే హిట్టర్ రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయిన టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీకి తోడుగా ఓపెనర్ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యార్ అద్భుత ప్రదర్శన విజయతీరాలకు చేర్చింది.
ఓపెనర్ కేఎల్ రాహుల్ (56: 27 బంతుల్లో 4x4, 3x6), కెప్టెన్ విరాట్ కోహ్లీ (45: 32 బంతుల్లో 3x4, 1x6) మెరుపు ఇన్నింగ్స్లతో భారత్ విజయానికి బాటలు వేయగా.. ఆఖర్లో శ్రేయాస్ అయ్యర్ (58 నాటౌట్: 29 బంతుల్లో 5x4, 3x6) హిట్టింగ్తో న్యూజిలాండ్కి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో.. 19 ఓవర్లలోనే 204/4తో భారత్ విజయాన్ని అందుకుంది. దీంతో.. ఐదు టీ20ల సిరీస్లో 1-0తో టీమిండియా ఆధిక్యాన్ని అందుకోగా.. రెండో టీ20 మ్యాచ్ ఆక్లాండ్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 12.20 గంటలకి ప్రారంభంకానుంది.
అంతకముందు టీమిండియా బౌలర్లని ఉతికారేసిన కివీస్ ఊహించని రీతిలో 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ జట్టులో ఓపెనర్ కొలిన్ మున్రో (59: 42 బంతుల్లో 6x4, 2x6), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (51: 26 బంతుల్లో 4x4, 4x6), రాస్ టేలర్ (54 నాటౌట్: 27 బంతుల్లో 3x4, 3x6) అర్ధ శతకాలు సాధించగా.. మార్టిన్ గప్తిల్ (30: 19 బంతుల్లో 4x4, 1x6) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 203 పరుగులు చేయగలిగింది.
భారత బౌలర్లు అందరూ ధారాళంగా పరుగులిచ్చేశారు. ఎంతలా అంటే..? జస్ప్రీత్ బుమ్రా మినహా అందరి ఎకానమీ 7.75కి పైనే ఉండటం విశేషం. 4 ఓవర్లు వేసిన బుమ్రా ఒక వికెట్ తీసి 31 పరుగులివ్వగా.. శార్ధూల్ ఠాకూర్ 3 ఓవర్లలో 44 పరుగులు, మహ్మద్ షమీ 4 ఓవర్లలో 53, చాహల్ 4 ఓవర్లలో 32, శివమ్ దూబే 3 ఓవర్లలో 24, జడేజా 2 ఓవర్లలో 18 పరుగులిచ్చేశారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో 17 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండగా.. భారత ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ బౌలింగ్లోనే ముప్పావు వంతు సిక్సర్లు వచ్చాయి. అతని బౌలింగ్ని లక్ష్యం చేసుకుని మున్రో, విలియమ్సన్ భారీ సిక్సర్లు బాదేశారు.
భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊహించని మార్పులు చేశాడు. కోహ్లీ చేసిన మార్పులు అంచనాలకు తగ్గట్టుగా సాగాయి. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్పై వేటు వేసి ఓపెనర్ కేఎల్ రాహుల్కి కీపింగ్ బాధ్యతలు అప్పగించాడు. దీంతో.. ఐదో స్థానంలో మనీశ్ పాండే రూపంలో అదనపు బ్యాట్స్మెన్ని తుది జట్టులోకి తీసుకున్నాడు. ఇక మణికట్టు స్పిన్నర్ కుల్దీప్పైనా వేటు పడగా.. చాహల్కి ఛాన్స్ దక్కింది. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్లో కీపర్గా రాహుల్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more