ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న దీక్షలు 32వ రోజుకు చేరుకున్నాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో స్థానికులు నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ‘ప్రాణాలైనా అర్పిస్తాం.. రాజధానిని సాధిస్తాం’ అంటూ అమరావతి ప్రాంత గ్రామస్థులు ఉద్యమిస్తున్నారు. మందడం, తుళ్లూరులో నిర్వహించిన మహాధర్నాలో మహిళలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో 29 గ్రామాల రైతులు, మహిళలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా తమ మొర ఆలకించాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. ప్రతిపాదిత మూడు రాజధానుల నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో నిరసన కార్య్రకమాల్లో పాల్గోన్న యువత జై అమరావతి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ నినదించారు. అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు తమ ఉద్యమం, నిరసన కార్యక్రమాలు ఆగవని ఆయన తెలిపారు.
రాజధాని పరిధిలోని 29 గ్రామాల పరిధిలో ఎక్కడ చూసినా ఇదే చిత్రం కనిపిస్తోంది. దీనికి తోడు పండుగులకు ఇంటికొచ్చిన బంధువులు కూడా తోడుకావడంతో వారు కూడా టెంట్లలోకి వెళ్లి తమవారికి మద్దతును ప్రకటిస్తూ.. అమరావతే రాజధాని కావాలన్న అకాంక్షను వెల్లడిస్తున్నారు. టెంట్లలో కూర్చోని నిరసన తెలియజేస్తున్న అందోళనకారులకు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. 32 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా.. తమను ప్రభుత్వం కానీ.. స్థానిక ఎమ్మెల్యే కానీ ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నించారు. ఎవరు ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యే అయ్యారని ఆందోళనకారులు నిలదీస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more