సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. అత్యంత రద్దీగా ఉండే సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద కారు బాంబు అమర్చిన ముష్కరులు రద్దీ అధికంగా వుండే సమయంలో దానిని పేల్చారు. ఈ ఘటనలో కనీసం 73 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు 73 మంది మృతదేహాలను గుర్తించినట్లు మేయర్ ఒమర్ మహమూద్ తెలిపారు. మృతుల్లో చాలా మంది స్థానిక యూనివర్శిటీకి చెందిన విద్యార్థులేనని చెప్పారు. పన్ను వసూలు కేంద్రం లక్ష్యంగా ముష్కరులు ఈ దాడికి పాల్పడ్డారు. ఉదయం సమయంలో ఇక్కడ రద్దీ విపరీతంగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాణనష్టం కూడా అధికంగా జరిగిందని అందోళన వ్యక్తం చేశారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పేర్కోన్నారు.
ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటనలు చేయలేదు. అయితే అల్ ఖైదా అనుబంధ సంస్థ అయిన అల్-షబాబ్ ఈ ప్రాంతంలో తరచూ దాడులు చేస్తుంటుంది. రద్దీగా ఉండే చెక్ పాయింట్లు, హోటళ్లను లక్ష్యంగా చేసుకొని గతంలో దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. 2017 అక్టోబరులో జరిగిన ట్రక్కు బాంబు పేలుడులో 500మందికి పైగా మరణించారు. ఈ దాడికి అల్-షబాబే కారణమని అప్పట్లో ప్రభుత్వం ఆరోపించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more