మూడేళ్ల చిన్నారిని చూస్తే ఎవరికైనా ముద్దుముద్దు మాటలు.. వారి నోరారా గారాలు పడుతూ పిలిచే పేర్లు, పాడే పాటలు, చేసే అల్లర్లు.. చిలిపి చేష్టలు ఇవే గుర్తుకువస్తాయి. కానీ ఆలాంటి చిన్నారిపై కామవాంఛను తీర్చుకోవాలన్న అలోచన పశువులకు కూడా రాదు. పిసిదానిపై అలాంటి కామోన్మాదానికి పాల్పడి.. తన పేరు ఎక్కడ చెప్పేస్తుందోనని అమెను హత్య చేసిన నిందితుడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం అతడికి మరణ శిక్ష విధించింది. ఒడిశాలోని కెంజొహార్ జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది.
2017 వ సంవత్సరంలో సునీల్ నాయక్ అనే నిందితుడు కెంజొహార్ జిల్లాలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తనకు బంధువులైన వారి పాపను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అమెపై అత్యాచారానికి తెగబడి.. అనంతరం అమెను హత్య చేశాడు. పోక్సో చట్టం కింద 28 సాక్షుల వివరణను పరిశీలించిన అనంతరం నిందితుడికి మరణశిక్ష ఖరారు చేసినట్లు కెంజొహార్ జిల్లా అదనపు మేజిస్ట్రేట్ లోక్నాథ్ సాహు తెలిపారు. కాగా, ఈ కేసులో తనను ఇరికించారని అరోపిస్తున్నాడు దోషిగా తేలిన సునీల్ నాయక్. తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ కేసులో తన ప్రమేయం కూడా లేదని పేర్కోన్నాడు.
దీంతో న్యాయస్థానం వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత కోర్టులకు వెళ్లనున్నట్లు తెలిపాడు. బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించగా బలవంతపు చర్య, షాక్తో చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. మృత బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన చంపువా స్టేషన్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడికి వ్యతిరేకంగా ఆరు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం విచారణ కొనసాగించిన అనంతరం నిందితుడికి మరణ శిక్ష విధించినట్లు ప్రభుత్వన్యాయవాది గణేష్ చంద్ర మహాపాత్రో తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more