జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాయలసీమ పర్యటనలో భాగంగా తిరుపతికి చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు స్థానిక నేతలతో కలసి ఆయన తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పవన్ కు స్వాగతం పలికిన ప్రొటోకాల్ అధికారులు, వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందించారు. సంప్రదాయ దుస్తుల్లో తెల్లపు వర్ణం లుంగీ కాషాయ వర్ణపు పై పంచను బ్రహ్మణుల మాదిరిగా చుట్టుకున్న పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
శ్రీవారి దర్శనానంతరం మీడియా పలుకరించడంతో.. మాట్లాడిన పవన్ కల్యాణ్.. తిరుమల స్వామివారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తాను 30 సంవత్సరాల క్రితం తిరుపతిలో యోగాభ్యాసం నేర్చుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా తాను నిత్యం అనుసరించే స్తూకి కూడా ఇక్కడ నేర్చుకున్నదేనని.. అదే 'ధర్మో రక్షతి రక్షితః' అని తెలిపారు. ఏడుకొండల వాడి సన్నిధానం నుంచి నేర్చుకున్న దానినే ఇప్పటికీ త్రికరణశుద్దిగా పాటిస్తున్నానని అన్నారు. దేశం సుబీక్షంగా వుండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వెంకటేశ్వరుడుని ప్రార్థించినట్టు తెలిపారు. పవన్ ను చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more