మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ల కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అంతకుముందు మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న ఘటనలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన మదిలోని మాటలను బయటపెట్టారు. సొంత పార్టీపై తిరుగుబాటు చేసి, బీజేపీతో చేతులు కలిపి, డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి, ఆ తర్వాత రాజీనామా చేసి, మళ్లీ సొంతగూటికే చేరిన ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనను బీజేపితో చేతులు కలిపేలా చేసింది కాంగ్రెస్ పార్టీ నేతలేనని నర్మగర్భవ్యాఖ్యాలు చేశారు.
మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నావీస్ తో అజిత్ పవార్ టచ్ లో ఉన్నట్టు తనకు తెలుసని చెప్పారు. అయితే అంతదూరం వెళ్లి వారు ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్న విషయం తనకు షాక్ కలిగించిందని అన్నారు. ఈ పరిణామం ఎన్సీపీ నేతలకే నచ్చలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇంతవరకు అజిత్ వెళ్లడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల భేటీలో కాంగ్రెస్ నేతలు మరికొన్ని పదవుల కోసం డిమాండ్ చేశారు. ఇది నచ్చక సమావేశం నుంచి తాను వెళ్లిపోయానని... తనతో పాటు అజిత్ కూడా బయటకు వచ్చేశారని శరద్ పవార్ తెలిపారు.
అదే రోజు రాత్రి ఫడ్నవీస్ తో అజిత్ మంతనాలు సాగించారని చెప్పారు. అయితే, అంత దూరం వెళతారని మాత్రం ఊహించలేకపోయానని అన్నారు. నవంబర్ 23న డిప్యూటీ సీఎంగా అజిత్ ప్రమాణస్వీకారం చేయడం చూసి తాను కూడా ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత అందరూ ఆయనకు మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఇక అజిత్ భవిష్యత్ విషయమై మాట్లాడిన ఆయన.. ఆయన లాంటి నేతలకు పార్టీలకు చాలా అవసరమని.. ప్రతినిత్యం పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం పనిచేస్తున్న నేత అయన అని కొనియాడారు. పార్టీలో ఆయనకు ప్రత్యేక స్థానం వుందన్నారు.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇటు కాంగ్రెస్, శివసేనతో పాటు బీజేపీతో కూడా ఎన్సీపీ చర్చలు జరిపిందని శరద్ పవార్ తెలిపారు. అయితే, కాంగ్రెస్ నాయకుల తీరు పట్ల అజిత్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారని... ఇదే ఆయన తిరుగుబాటుకు కారణం అయి ఉండవచ్చని చెప్పారు. ఇక తమ నూతన మిత్రుడు శివసేనతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చిచెప్పాన శరద్ పవార్.. తమ పాతమిత్రుడైన కాంగ్రెస్ పార్టీతోనే తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వం మనుగడపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more