ఓ రెండేళ్ల క్రితం దుబాయ్ లో కరెన్సీ నోట్ల వర్షం కురిసిందని విన్నాం. అలాంటిదే మన దగ్గర కూడా జరిగితే బాటుంటుందని చాలా బలంగా అనుకున్నట్లు వున్నారు పశ్చివ బెంగాల్ రాష్ట్రవాసులు. కొంత సమయం తీసుకున్నా నిన్న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో కాసుల వర్షం కురిసింది. అంటే బలంగా కోరుకుంటే జరిగిపోతుందా.? అన్న సందేహాలు కలుగుతున్నాయా.? ఈ విషయంలో క్లారిటీని పక్కనబెడితే.. ఈ వర్షాన్ని కురిపించింది మాత్రం ఓ కంపెనీ అని తెలిసింది. వర్షాన్ని కురిపించే కంపెనీలు కూడా వున్నాయా.? అంటే ఔనని చెప్పక తప్పదు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్ కతాలోని ఓ బహుళ అంతస్తుల భవనం నుంచి క్రితం రోజు మధ్యాహ్నం నోట్ల వర్షం కురిసింది. తొలుత నోట్లను చూసి విస్మయానికి గురైన స్థానికులు ఆ తరువాత వాటని తమ జేబుల్లో పెట్టుకునేందుకు పోటీ పడ్డారు. ఆరో అంతస్తు నుంచి ఈ నోట్ల వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా రద్దీగా మారింది. అయితే కొద్దిసేవు మాత్రమే కురిపిన నోట్ల వర్షం ఆ తరువాత ఆగిపోయింది. ఈ నోట్ల వర్షం వివరాల్లోకి వెళ్తే.. కొల్ కతా నగరంలోని బెంటిక్ స్ట్రీట్లోని ఓ భవనంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడులు జరిపారు.
ఈ విషయం తెలుసుకున్న పక్కనే ఉన్న హోఖ్ మెర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిబ్బంది ఆరో అంతస్తులోని కిటికీ నుంచి నోట్ల కట్టలను కిందికి విసిరేశారు. పై నుంచి కురుస్తున్న నోట్ల వర్షాన్ని చూసిన జనం తొలుత ఆశ్చర్యపోయారు. అయితే నోట్ల వర్షం వీడియోలను తీసిన జనం ఆ తరువాత అందినంత పట్టుకుని ఎంచక్కా వెళ్లిపోయి.. వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేశారు. కిందపడిన నోట్లలో రూ.2,000, రూ.500, రూ.100 నోట్లు ఉన్నాయి. నోట్లు విసిరేసిన ఘటనపై డీఆర్ఐ అధికారులు మాట్లాడుతూ.. తమ సోదాలకు, నోట్లు వెదజల్లడానికి కారణం ఉందని అనుకోవడం లేదన్నారు.
#WATCH Bundles of currency notes were thrown from a building at Bentinck Street in Kolkata during a search at office of Hoque Merchantile Pvt Ltd by DRI officials earlier today. pic.twitter.com/m5PLEqzVwS
— ANI (@ANI) November 20, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more