Chintamaneni out of jail after 66 days! బెయిలుపై విడుదలైన చింతమనేని.. వైసీపీపై విమర్శలు..

Former mla chintamaneni prabhakar released from jail

chintamaneni Prabhakar, Denduluru former MLA, TDP leader, Eluru sub-jail, Bail, Grand Welcome, SC and ST atrocity case, YSRCP, YCP Govt, Andhra Pradesh, Politics

The TDP leader and Denduluru former MLA Chintamaneni Prabhakar have been released from the Eluru sub-jail after getting bail on Saturday, after 66 days. On the occasion, the TDP leaders and activists reached the jail and given a grand welcome to him.

బెయిలుపై విడుదలైన చింతమనేని.. వైసీపీపై విమర్శలు..

Posted: 11/16/2019 08:13 PM IST
Former mla chintamaneni prabhakar released from jail

టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బెయిల్ పై విడుదలయ్యారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసులు నమోదు కావడంతో పాటు ఆయనపై మరో 18 కేసులు కూడా నమోదైన నేపథ్యంలో అన్ని కేసుల సంబంధించి ఆయన ఇవాళ బెయిలు మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. జైలు నుంచి బయటకు రాగానే ఆయన దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తనపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కక్షపూరితంగానే కేసులు పెట్టారని అరోపించారు.

తాను ఏ దళితుడి ఆస్తి కోసం ఆశపడలేదని, ఇతరులకు సాయం చేసేందుకు తాను సొంత ఆస్తులు తగలేసుకునేవాడ్నే తప్ప, ఇతరుల ఆస్తులు తనకు అవసరంలేదని అన్నారు. 18 కేసులు పెట్టి ఎవర్ని వేధించాలనుకుంటున్నారు? అంటూ చింతమనేని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక్క కేసులో తాను తప్పు చేసినట్టు తేలినా, ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పేరును ప్రస్తావించకుండా ఆయనపై నేరుగా విమర్శలను ఎక్కుపెట్టారు. "గతంలో నువ్వు వేదనకు గురయ్యావు కదా అని ఇతరులను కూడా అలాగే వేధించడం సరికాదని అన్నారు.

‘‘నీకు 150 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అహంభావం, పొగరుతో వ్యవహరించడం అవసరమా? సెక్షన్ 30 అమలు చేసి.. నా అభిమానులను ఎందుకు కొట్టారు? ఏం నష్టం జరుగుతుందని విగ్రహాలకు దండ వేయొద్దన్నారు?" అంటూ ప్రశ్నించారు. మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవడం అంటే, రైతు భరోసా అమలు చేయడం, ఆటో డ్రైవర్లకు రూ.10 వేలు ఇవ్వడం, ఆరోగ్య శ్రీ అమలు చేయడం మాత్రమే కాదు, శాంతిభద్రతలను అమలు చేసి, ఇతరుల మనసులు గాయపర్చకుండా ఉన్నప్పుడే మంచి సీఎం అనిపించుకుంటారని హితవు పలికారు. తాను దళిత వ్యతిరేకి అని తన నియోజకవర్గంలోని ఏక్కడ నిరూపించినా, అక్కడే తాను దోషినని ఒప్పుకుంటానని స్పష్టం చేశారు.

అప్పటి ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారంపై ఇప్పటికీ తన గురించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పట్లో చంద్రబాబు నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ తనపై సెక్షన్ 350 కింద కేసు నమోదు చేయించారని తెలిపారు. ఇవాళ సీఎం కార్యదర్శిగా ఉన్న సాల్మన్ అరోకియ రాజ్ ఈ విషయంలో నిజాలు వెల్లడించాలని కోరారు. తాను తప్పుచేశానని చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు.  వనజాక్షి వ్యవహారాన్ని జేసీ శర్మ కమిటీ విచారణ జరిపిందని అందులో సల్మాన్ అరోకియ రాజ్ కూడా సభ్యుడని చింతమనేని వెల్లడించారు. ఎమ్మార్వో వనజాక్షిపై తాను ఎలాంటి దౌర్జన్యం చేయలేదని, దాడి చేయలేదని, ఆమెను దుర్భాషలాడలేదని స్పష్టం చేశారు.

అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని చెప్పానని తెలిపారు. ఈ వ్యవహారంలో తనను దుశ్శాసనుడిని చేస్తున్నారని అవేదన చెందారు. వైసీపీ ప్రభుత్వమే వనజాక్షి వ్యవహారాన్ని మొదటి నుంచి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై ఉన్న కేసులకు ఒకవేళ శిక్షపడితే ఆర్నెల్ల వరకు పడుతుందేమోనని, కానీ జగన్ పై ఎన్నో చార్జిషీట్లు ఉన్నాయని, శిక్ష పడితే ఆయనకు ఉండదా బాధ? అంటూ వ్యాఖ్యానించారు. ఇరత పార్టీల నేతలు మీలాంటి మనషులు కారా.? వారికి మీలా హృదయాలు వుండవా.? అని ప్రశ్నించారు. ఆ రోజున నిన్ను జైల్లో వేస్తే నీ తల్లి, చెల్లి, కార్యకర్తలు, అభిమానులు ఎలా తల్లడిల్లిపోయారు? ఎంత చెట్టుకు అంత గాలి! నీది పెద్దచెట్టు కాబట్టి అంతగాలి, నాకుండే గాలి నాకుంటుంది కదా!' అంటూ చింతమనేని తీవ్రస్థాయిలో స్పందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles