Telangana liquor is on high sale than AP తెలంగాణ మద్యానికి పెరిగిన గిరాకీ.. ఎంతో రుచిరా.!

Telangana liquor is on high sale than ap in bordering districts

Telangana liquor, Excise department, telangana liquor sales, Telangana liquor sale, Andhra Pradesh excise rules, AP excise policy, Ap Telangana bordering districts, Telangana Crime

Telangana liquor is on high sale than Andhra Pradesh in bordering districts as the price of liquor is less and shop closing time too is very late, when compared.

తెలంగాణ మద్యానికి పెరిగిన గిరాకీ.. ఎంతో రుచిరా.!

Posted: 11/16/2019 06:04 PM IST
Telangana liquor is on high sale than ap in bordering districts

నిధుల లేమితో అంగలార్చుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనురుగా అవతరించిన మద్యాన్ని వదులేసుకుంది. ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని మహిళా ఓటర్లకు ఇచ్చిన మాటకు కట్టుబడిన వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను నియంత్రిస్తూ కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చింది. దీంతో రాష్ట్రానికి ఆదాయం తగ్గింది. అయితే తగ్గిన ఆదాయాన్ని మరోలా రాబట్టుకునేందుకు ఏకంగా మధ్యం ధరలకు కూడా విపరీతంగా పెంచింది అక్కడి ఎక్సైజ్ శాఖ. ఈ విధానం ఆంధ్ర సరిహద్దు జిల్లాల్లోని తెలంగాణ మద్యం దుకాణాల వ్యాపారుల పాలిట కలిసివస్తోంది.

అంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మందుబాబులు ఏకంగా తెలంగాణకు క్యూకడుతున్నారు. తెలంగాణలో మద్యం ధరలు తక్కువ కావడంతో పాటు దుకాణాలు కూడా రాత్రి పదకొండు గంటల వరకు తెరచి వుండటంతో మందుబాబు.. ఏపీలో డబ్బులు పెట్టి మద్యం కొనడం కంటే.. తెలంగాణలో మద్యం కొనుగోలు చేయడం తమకు కలసి వస్తుందని, తక్కువ ధరకే కిక్కు లభిస్తోందని బారులు తీరుతున్నారు. తమ రాష్ట్రంలో రాత్రి 8 గంటలకే దుకాణాలు మూతపడుతుండడంతో అల్లాడిపోతున్న సరిహద్దు గ్రామాల్లోని మద్యం ప్రియులు తెలంగాణ మద్యం పాలసీకి జై కోడుతున్నారు.

దీంతో ఏపీ సరిహద్దులోని తెలంగాణ గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాలకు సరికొత్త కళ వచ్చిచేరింది. అటు నల్గోండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల మద్యం దుకాణాలు కళకళలాడుతున్నాయి. గతంతో పోలిస్తే ఏకంగా మూడు రెట్లు అధికంగా మద్యం అమ్ముడుపోతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఏపీలోని తెలంగాణ సరిహద్దు గ్రామాలైన కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ, వీరులపాడు మండలాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్నాయి. ఈ మండలాల్లోని ప్రజలు తమకు సమీపంలోని తెలంగాణ పల్లెల్లో ఉన్న మద్యం దుకాణాలపై పడుతున్నారు.

దీంతో సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలోని మద్యం షాపులకు తాకిడి పెరిగింది. ఇటు కర్నూలు జిల్లాకు అనుకుని వున్న మహబూబ్ నగర్ జిల్లాలోనూ అదే పరిస్థితి కనబడుతోంది. కొందరు ఇదే అదునుగా అక్రమ అమ్మకాలకు తెరతీశారు. తెలంగాణ నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చిన మద్యాన్ని స్థానికంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నందిగామ ఎక్సైజ్ అధికారులు తెలంగాణ నుంచి మద్యంప్రియులు అక్రమంగా తీసుకొచ్చిన 203 మద్యం సీసాలను పట్టుకున్నారు. చందర్లపాడుకు చెందిన యంపతి మల్లేశ్వరి, పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన కోపల్లి ప్రకాశ్‌రావును అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles