దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. దేశంలో అత్యధిక కస్టమర్లు కలిగిన బ్యాంకుగా అవతరించిన తరువాత ఎస్బీఐ కస్టమర్లకు అనేక షాక్ లు ఇస్తూనే వుంది. తాజాగా నవంబర్ 1 నుంచి కొత్త రూల్ అమలులోకి రానుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఇప్పటికే తెలియజేసింది. నవంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. దీంతో బ్యాంకులో డిపాజిట్ చేసే వారికి తక్కువ రాబడి రానుంది.
స్టేట్ బ్యాంక్ నవంబర్ 1 నుంచి సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత విధించింది. 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. రూ.లక్ష వరకు డిపాజిట్లు ఉన్న అకౌంట్లకే ఇది వర్తిస్తుంది. దీంతో 1వ తేదీ నుంచి బ్యాంక్ కస్టమర్లకు 3.5 శాతం వడ్డీ రేటు కాకుండా 3.25 శాతం మాత్రమే వడ్డీ లభిస్తుంది. ఎస్బీఐ ఇదివరకే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక రెపో రేటు తగ్గించడం ఇందుకు కారణం.
రెపో రేటు ఇప్పుడు 5.15 శాతంగా ఉంది. ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 0.10 శాతం తగ్గుదలతో 6.4 శాతానికి దిగొచ్చాయి. ఏడాది నుంచి 2 ఏళ్ల కాలపరిమితిలోని డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. స్టేట్ బ్యాంక్ అలాగే రూ.2 కోట్లకు పైన ఉన్న డిపాజిట్ అకౌంట్లపై కూడా రేట్లను తగ్గించింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో 0.30 శాతం కోత విధించింది. దీంతో ఈ డిపాజిట్లపై 6.3 శాతం కాకుండా 6 శాతం మాత్రమే వడ్డీ లభిస్తోంది. కేవలం ఎస్బీఐ మాత్రమే కాకుండా ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more