ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించేంత వరకు తమ ఉద్యమం కోనసాగిస్తున్న అర్టీసీ కార్మికులకు ఊరట లభించింది. సమ్మె నేపథ్యంలో కార్మికుల వేతనాలను నిలిపివేసిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వేసిన పిటీషన్ పై విచారించిన రాష్ట్రోన్నత న్యాయస్తానం కార్మికులకు జీతాలను చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అదేశించింది. ఈ నెల 21లోపు ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
సెప్టెంబర్ నెలకు సంబంధించి 49 వేల 190 మంది కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు చెల్లించ లేదు. అయితే దీనిపై హైకోర్టుకు వెళ్లిన పిటిషనర్.. వెంటనే జీతాలు చెల్లించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. అక్టోబర్ 5 నుంచి సమ్మెకు వెళ్లిన కార్మికుల.. సెప్టెంబర్ మాసం వేతనాలను ఎందుకు చెల్లించలేదని ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. సమ్మె కొనసాగుతున్నందున సిబ్బంది లేరని ఆర్టీసీ యాజమాన్యం కోర్టుకు తెలిపింది. ఇరు వాదనలు విన్న కోర్టు సోమవారం లోపు సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది.
ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5 నుంచి సమ్మె చేస్తున్నారు. జీతాల పెంపు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం తదితర డిమాండ్లతో స్ట్రైక్ కి దిగారు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాదు విధుల్లోకి రాని వారిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ప్రకటించారు. ఆర్టీసీలో 1200 మాత్రమే ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. విధుల్లోకి రాని కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు కూడా ఇవ్వలేదు. దీంతో కార్మికులు కోర్టుని ఆశ్రయించారు. కోర్టులో వారికి ఊరట లభించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more