తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చింది. ఇటు ప్రభుత్వం అటు కార్మికులు బెట్టువీడకపోవడంతో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందుకులు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తక్షణం సమ్మె విరమించాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం - యూనియన్ల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనలు తెలపడానికి అనేక మార్గాలున్నాయంటూ సూచించింది.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు సాగాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయలేమని ప్రభుత్వం తరపు న్యాయవాదులు హైకోర్టుకు స్పష్టం చేశారు. ఆర్టీసీని విలీనం చేస్తే మరికొన్ని కార్పోరేషన్లు ముందుకొస్తాయని తెలిపింది. కార్మికుల సమ్మె ప్రజలపై పడకుంగా 6 వేల బస్సులను నడుపుతున్నామని కోర్టుకు తెలిపింది. ప్రైవేటు వ్యక్తులు బస్సులు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
యూనియన్ తరపు నుంచి న్యాయవాది దేశాయక్ ప్రకాశ్ వాదానలు వినిపిస్తున్నారు. కార్మికుల సమస్యలపై 30 రోజుల క్రితమే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చామని. ప్రభుత్వమే ఎలాంటి చర్యలు చేపట్టలేదు, ఆఖరి అస్త్రంగా సమ్మెకు వెళ్లడం జరిగిందని చెప్పారు. సమస్యలపై అనేకసార్లు విన్నపాలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. నెల రోజుల నుంచి అసలు పట్టీపట్టనట్టుగా వ్యవహరించిన ప్రభుత్వం.. ప్రజల ముందు తమను దోషులుగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని వాదించారు.
సమ్మె యధాతథం: టీఎస్ఆర్టీసీ జేఏసీ
సమ్మె విరమించే ప్రసక్తే లేదని..యథాతథంగా కొనసాగుతుందని టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం పిలిస్తే చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం గానీ, యాజమాన్యం గానీ చర్చలకు పిలిస్తే వెళ్తామని చెప్పారు. అక్టోబర్ 18 వ తేదికి కేసు వాయిదా వేసింది. ఈ లోపు సమస్యల పరిష్కారమై ఇరువర్గాలు పూర్తిస్థాయిలో చర్చించుకోవాలని కోర్టు సూచించిందని తెలిపారు. ప్రభుత్వ తరపు లాయర్లను ప్రభుత్వంతో మాట్లాడాలని.. యూనియన్ తరపు లాయర్లను కార్మిక సంఘాల నేతలతో మాట్లాడాలని 18న కోర్టుకు ముందుకు రావాలని సూచించినట్లు తెలిపారు.
సమ్మె విరమించమని హైకోర్టు చెప్పలేదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలని కోర్టు ప్రభుత్వానికి తెలిపిందని గుర్తు చేశారు. ప్రభుత్వం చర్చలు జరిపితే సమ్మె విరమణకు సిద్ధంగా ఉండాలని కార్మిక సంఘాలకు కోర్టు తెలిపిందని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి చర్చలకు పిలవకుండా కార్మికులు సమ్మె విరమించాలంటే అది జరిగే పని కాదన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలవాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికిప్పుడే కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more