అఖిలాండకోటి బ్రహ్మోడనాయకునిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల పాలిట కొంగుబంగారమైన.. అల శ్రీనివాసుడికి ఇల వైకుంఠమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రతీ నెల రెండు రోజుల పాటు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ కమిటీ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేవలం సిఫార్సు లేఖలతో వచ్చిన భక్తులకు మాత్రమే ఇచ్చే పెద్ద లడ్డూలు, వడలు ఇకపై సామాన్య భక్తులకు కూడా అందించే నిర్ణయం తీసుకున్న కమిటీ. తాజాగా అలాంటిదే మరో నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ ప్రత్యేక దర్శనం కేవలం వయోవృద్దులకు, దివ్యాంగులతో పాటు చంటి పిల్లల తల్లులకు మాత్రమే. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే వీరు.. భక్తుల రద్దీలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. వీరి కోసం నెలలో రెండు రోజులు వారికి ప్రత్యేక దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అక్టోబర్ 15, 29 తేదీల్లో వృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లు జారీ చేయనున్నారు.
ఈ 2 రోజుల్లో ఉదయం 10 గంటల స్లాట్కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటల స్లాట్కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. ఐదేళ్లలోపు చంటి పిల్లల(ఐదేళ్లలోపు) తల్లిదండ్రులకు అక్టోబర్ 16, 30 తేదీల్లో బుధవారం ఉదయం 10 గంటలకు సుపథం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇక మీదట ప్రతినెల 2 రోజులు వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు స్వామివారిని దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. వృద్ధులు, దివ్యాంగులకు ఇచ్చే టోకెన్లను.. ఎస్వీ మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్లో ఉదయం 7 గంటల నుంచి మంజూరు చేస్తారు.
అలాగే ఇక ప్రతి నెల 15వ తేదీన 5ఏళ్ల లోపు చంటిపిల్లల తల్లిదండ్రులను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ప్రవేశమార్గంలో అనుమతిస్తారు. ధారణ రోజుల్లో ఏడాది లోపు పిల్లల తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా దర్శనం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more