ఓ 32 ఏళ్ల మహిళపై తొమ్మిది మంది కామాంధులు ఫైశాచిక మృగాళ్ల మాదిరిగా తెగబడి అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత అమెను నడిరోడ్డుపై పడేసి పారిపోయారు. తమ బంధువుల అమ్మాయి అసుపత్రిలో చికిత్స పోందుతున్న విషయం తెలుసుకుని పరామర్శించేందుకు వచ్చిన మహిళపై మానవమృగాళ్లు ఘాతుకానికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన త్రిపురలోని అగర్తలాలో జరిగింది. సభ్యసమాజం తలగించుకునే ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి..
అగర్తలాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ బంధువుల బాలికను పరామర్శించేందుకు వెళ్లిన మహిళ.. తమ ఇంటికి తిరుగు పయనం అయ్యేందుకు ఆటోను ఆశ్రయించింది. అమెను ఎక్కించుకున్న అటోడ్రైవర్ అతని ‘ మంది స్నేహితులతో కలసి మహిళపై గ్యాంగ్ రేప్ కు ఒడిగట్టాడు. గత మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. రోడ్డు మీద పడి ఉన్న మహిళలు స్థానికులు గుర్తించి ఆమెను జీబీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, అయితే, చికిత్స కొనసాగిస్తున్నామని వైద్యులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్పత్రిలో బాలికను పరామర్శించిన తర్వాత రాత్రి 7.30గంటల సమయంలో ఇంటికి వెళ్లేందుకు ఓ తెలిసిన వ్యక్తి ఆటో ఎక్కింది. అయితే, అతడు వేరే మార్గంలో వెళ్తుండడంతో అతడిని ప్రశ్నించింది. అయితే, తాను మరికొందరు ప్రయాణికులను ఎక్కించుకునేందుకే ఈ మార్గంలో వెళ్తున్నానని చెప్పాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఆటోలో నలుగురు యువకులు ఎక్కారు. ఏదో కీడు జరుగుతుందని ఆమె శంకించింది. అయితే, వారు ఆటో ఎక్కిన వెంటనే ఆమె నోరు నొక్కేశారు. చేతులు, కాళ్లు కట్టేశారు.
కొంత దూరం వెళ్లిన తర్వాత ఆమెను ఓ కారులోకి మార్చారు. నర్సింగఢ్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే మరో నలుగురు యువకులు కాచుకుని కూర్చున్నారు. వారు కూడా కారులోకి ఎక్కారు. సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి ఆమెపై తొమ్మిది మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం రాత్రి 11.30 గంటల సమయంలో ఆమెను రోడ్డు మీదకు తీసుకొచ్చి పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు తూర్పు అగర్తలాలోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆరుగురిని అరెస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more