కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ఖాన్ విచారణ నిమిత్తం ఇశాళ జోధ్పూర్ కోర్టులో హాజరు కానున్నాడు. 21 ఏళ్ల క్రితం 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్.. తన తోటి నటీనటులు సైఫ్ అలీ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలం కొఠారీలతో కలిసి రెండు కృష్ణ జింకలను వేటాడినట్టు సల్మాన్ ఖాన్ పై ఆరోపణలున్నాయి. ఈ విషయమై జోథ్పూర్ కోర్టు దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు విచారణ నిమిత్తం సల్మాన్ ఖాన్ జోథ్పూర్ కోర్టుకు హాజరు కానున్నారు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ న్యాయస్థానానికి వస్తున్నరన్న వార్త నేపథ్యంలో ఆయన అభిమానుకలు కూడా పెద్ద సంఖ్యలో న్యాయస్థానానికి వచ్చే అవకాశాలు వున్నాయి. దీంతో కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం సల్మాన్ ఖాన్ ను దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సల్మాన్ ప్రస్తుతం బెయిలుపై ఉన్నాడు. కోర్టుకు హాజరు కాకుంటే బెయిలు రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించిన నేపథ్యంలో సల్మాన్ ఇవాళ జోధ్పూర్ న్యాయస్థానంలో హాజరుకానున్నాడు.
కాగా, జోధ్పూర్ న్యాయస్థానానికి హాజరయితే హతమారుస్తామంటూ బాలీవుడ్ నటుడికి బెదిరింపులు కూడా వచ్చాయి. గ్యారీ షూటర్ పేరిట ఫేస్ బుక్ లో హెచ్చరిక పోస్టులు కనిపించడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సల్మాన్ ఖాన్ కోర్టుకు రానున్న నేపథ్యంలో ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను కల్పించనున్నారు. న్యాయస్థానం అవరణలోనూ మరింత భద్రత పెంచారు. సల్మాన్ ఫొటోకు రెడ్క్రాస్ మార్కు చేసి ‘007 లారెన్స్ బిష్ణోయ్’ ముఠా ఈ హెచ్చరికలు జారీ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ పోస్టుపై దర్యాప్తు చేస్తున్నట్టు రాజస్థాన్ పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more