ఆంధ్రప్రదేశ్ లో మద్యంబాబులు ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. అయితే రెక్కాడితే కాని డొక్కాడని వాళ్లు విషయాన్ని పక్కన బెడితే.. కాసింత ఎగువ మధ్యశ్రేణి కుటుంబాలకు చెందిన మద్యంబాబులతో పాటు ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తమ ఓట్లు కూడా ఒక కారణమని.. దానిని విస్మరించిన సర్కార్ తమనే టార్గెట్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
అదేంటి ఈ ఎగవ మధ్యతరగతి, ఉన్నత వర్గ మద్యంబాబులకు వైఎస్ సర్కార్ ఇచ్చిన షాక్ అలాంటిది మరీ. అదేంటి అంటే.. ఇప్పటివరకు సాగినట్లుగా ఇష్టం వచ్చినట్టు ఇంట్లో బార్ పెట్టుకుంటామంటే కుదరదని ప్రభుత్వం తాజాగా అదేశాలను జారీ చేసింది. ఇకపై ఏ వ్యక్తి అయినా తన ఇంట్లో కేవలం మూడు బాటిళ్లకు మించి మద్యాన్ని నిల్వ చేసుకోవడానికి వీలులేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నూతన విధానాలను అమల్లోకి తీసుకువచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో బెల్ట్ షాపులను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల వద్ద నుంచి భారీ ఎత్తున సరుకుని కొనుగోలు చేసే కొందరు వ్యక్తులు.. వాటిని ఇంటి వద్ద విక్రయించే అవకాశం ఉంది. అలాంటి వారిని కట్టడి చేయడానికి రాష్ట్రప్రభుత్వం ఈ కొత్త ఆర్డర్స్ ఇచ్చింది.
గతంలో వ్యక్తులు ఆరు బాటిళ్ల వరకు మద్యాన్ని ఇంట్లో నిల్వ ఉంచుకునేందుకు అవకాశం ఉండేది. అయితే జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు పర్చేపనిలో భాగంగా తాజాగా ఆ సంఖ్యను సగానికి తగ్గించింది. ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం దశలవారీగా అమలు చేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
తొలి దశలో బెల్ట్ షాపులను మూయించారు. బ్లాక్ మార్కెట్లో మద్యం అమ్మకాలు జరగకుండా, కల్తీ మద్యం లేకుండా కట్టడి చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత మద్యాన్ని ప్రభుత్వం దుకాణాల్లోనే విక్రయించేలా కొత్త పాలసీని తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న నూతన మధ్యం విధానం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. మద్యాన్ని విక్రయించే దుకాణాల్లో పని చేసేందుకు ఉద్యోగులు నియమించుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more