జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంద్ర ప్రదేశ్ లోని ప్రస్తుత వైఎస్సార్ ప్రభుత్వం విమర్శలు కురిపించాడు. అధికారంలోకి వచ్చి ప్రజల కోసం ప్రతీ పైసాను వెచ్చించాల్సిన ప్రభుత్వాలు.. పథకాల పేరుతో ప్రచారం కూడా చేసుకోవడంపై దుయ్యబట్టారు. ప్రస్తుత ప్రభుత్వం, గత ప్రభుత్వంపై జనసేన పార్టీ సెటైర్లు విసిరింది. నాటి, నేటి ప్రభుత్వాల పాలనలో రాష్ట్రంలో ప్రజాధనం వృథా అయిందని, అవే డబ్బా ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.
‘అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైసీపీ’ అంటూ రెండు రక్షిత మంచినీటి పథకం ట్యాంకుల ఫొటోలను పోస్ట్ చేసింది. ఇందులో ఒక ట్యాంక్ కు పసుపు రంగు.. మరో ట్యాంక్ కు నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులు వేసి ఉండటం స్పష్టంగా కనపడుతుంది. ‘అవే డబ్బా ప్రచారాలు, ప్రజాధనంతో రంగులు వేసుకోవడాలు’, ‘దొందూ దొందే’ అని ఆయా పార్టీలను విమర్శించారు. రెండు పార్టీలు అధికారంలో వుండగా, ప్రజాధనంలో ప్రచారం చేసుకున్నాయని ఆయన మండిపడ్డారు.
అవే డబ్బా ప్రచారాలు ప్రజా ధనంతో రంగులు వేసుకోడాలు
— JanaSena Party (@JanaSenaParty) September 26, 2019
"దొందూ దొందే" pic.twitter.com/ELKqzZe1yY
ఇక తన ఆరోగ్యం బాగాలేదంటూ ఓ లేఖ విడుదల చేశారు. మీడియా స్వేచ్ఛ కోసం విజయవాడలో నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి తాను రాలేకపోతున్నానని వెల్లడించారు. గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో వెన్నుపూసలకు తీవ్రగాయాలయ్యాని, ఇప్పటికీ ఆ నొప్పి వీడడంలేదని వివరించారు. ఎన్నికల సమయంలో ఆ నొప్పిని అలక్ష్యం చేయడంతో గాయాల తీవ్రత మరింత పెరిగిందని, డాక్టర్లు శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారని పవన్ తన లేఖలో తెలిపారు.
అయితే సంప్రదాయ వైద్యవిధానాల పట్ల నమ్మకంతో సర్జరీ చేయించుకోదలచుకోలేదని వెల్లడించారు. ప్రస్తుతం వెన్ను నొప్పి తిరగబెట్టడంతో మూడు రోజులుగా ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడంలేదని, మీడియా మిత్రులు నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా హాజరుకాలేనని వివరించారు. మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి నా తరఫున, జనసైనికుల తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుంది అంటూ లేఖలో పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more